Skip to main content

మార్చి 15న విడుద‌ల‌వుతున్న `జెస్సీ`

jessie Movie Press Meetఅతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 15న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

 

నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ – “సినిమా మార్చి 15న విడుద‌ల‌వుతుంది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా సినిమా విడుద‌ల‌వుతుంది. వంశీ కాకా  చాలా స‌పోర్ట్ చేశారు“ అన్నారు.

 

ఆషిమా న‌ర్వాల్ మాట్లాడుతూ – “ఈ సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ చాలా మంది మారిపోయారు. ఇది నా మొద‌టి సినిమాగా విడుద‌ల కావాల్సింది. కొన్ని కార‌ణాల‌తో ఆల‌స్యం కావ‌డంతో మ‌రో సినిమా, నా తొలి సినిమాగా విడుద‌లైంది. మెయిన్‌లీడ్‌గా మంచి క్యారెక్ట‌ర్ చేశాను.15న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను చూసి అంద‌రూ ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

 

ద‌ర్శ‌కుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ – “రెండేళ్లు సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డాం. సినిమా బాగా చేశాం. మార్చి 15న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

 

మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ – “ఈ నెల 15న సినిమా విడుద‌ల‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాను. రెండేళ్లు సినిమా కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డాం. సాధార‌ణంగా వెనుక నుండి వ‌చ్చి ఎవ‌రైనా ఉన్నట్టుండి చెయ్యేస్తే భ‌య‌ప‌డతాం. కానీ ఎవ‌రూ లేకుండా అలా యాక్ట్ చేయ‌డం చాలా క‌ష్టం. అలాంటి ఫీలింగ్ ఉన్న స‌న్నివేశాల‌ను న‌టీన‌టులు క‌ష్ట‌ప‌డి చేశాం. సినిమా బాగా ఉంటుంది. డైరెక్ట‌ర్ అశ్వినికుమార్ సినిమా బాగా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు సంగీతం అందించ‌డాన్ని ఎంజాయ్ చేశాను“ అన్నారు.

 

విమ‌ల్ కృష్ణ‌ మాట్లాడుతూ – “సినిమా కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాం. అయితే మా కాన్ఫిడెన్స్ ఏమాత్రం మార‌లేదు. మంచి సినిమా చేశాం. హార‌ర్ కంటే ఇద్ద‌రు సిస్ట‌ర్స్ మ‌ధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది. శ్రీచ‌ర‌ణ్ త‌న బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు“ అన్నారు.

 

అభిన‌వ్ గోమ‌టం మాట్లాడుతూ – “ఇదొక సైకాలాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌. డిఫ‌రెంట్ రోల్ ప్లే చేశాను. హార‌ర్ కామెడీ కాదు కాబ‌ట్టి.. కామెడీ పెద్ద‌గా ఉండ‌దు. అశ్విన్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. నిర్మాతగా శ్వేతా ఎలాంటి సినిమాలను భ‌విష్య‌త్‌తో చేస్తార‌న‌డానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఒక కొత్త ప్ర‌య‌త్నం. అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

అతుల్ కుల‌క‌ర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్‌, శ్రీతా చంద‌నా.ఎన్‌, విమ‌ల్ కృష్ణ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి స్ట్రిల్స్:  కృష్ణ‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను, విఎఫ్ఎక్స్‌:  వెంక‌ట్‌.కె, మేక‌ప్‌:  చిత్రా మోద్గిల్‌, సౌండ్ డిజైన్‌, మిక్సింగ్‌:  విష్ణు పి.సి, అరుణ్.ఎస్‌, క్యాస్టూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్, మాట‌లు, పాట‌లు:  కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, కొరియోగ్రాఫ‌ర్‌: ఉద‌య్‌భాను(యుడి), ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌:  గ్యారీ బి.హెచ్‌, మ్యూజిక్‌: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, సినిమాటోగ్రఫీ:  సునీల్‌కుమార్‌.ఎన్‌, ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేతా సింగ్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  అశ్వినికుమార్‌.వి

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2u0qvL6

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...