Skip to main content

రాయ్ లక్ష్మీ ని అందుకే ఎంపిక చేశా – నిర్మాత శ్రీధర్ రెడ్డి

Where is the Venkatalaxmi Producer Sridhar reddy confident on successహాట్ భామ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి ,ఆనంద్ రెడ్డి , ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి ”. ప్రవీణ్ – మధునందన్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈనెల 15 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు నిర్మాత శ్రీధర్ రెడ్డి . వేర్ ఈజ్ వెంకట లక్ష్మి విశేషాలతో పాటుగా తన గురుంచి తన మాటల్లోనే ……

 

* అనంతపురం కు చెందినవాడినైన నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా చాలా ఇష్టం , దాంతో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూనే పలు సినిమాలను రిలీజ్ చేశాను . అయితే వాటిల్లో హిట్ అయినవి ఉన్నాయి అలాగే నష్టపోయినవి కూడా ఉన్నాయి దాంతో ఎవరో తీసిన సినిమాని రిలీజ్ చేయడం కంటే నేనే సినిమాలు చేస్తే బెటర్ కదా ! అని ఈ సినిమా ప్లాన్ చేశాను .

 

* దిల్ రాజు నిర్మాతగా నాకు స్ఫూర్తి , ఆయన నిర్మించిన పలు చిత్రాలు నన్ను ఎంతో ప్రభావితం చేసాయి దాంతో దిల్ రాజుని ఆదర్శంగా తీసుకొని చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాను . మొదటి చిత్రం తోనే చిత్ర నిర్మాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను .

 

* కిరణ్ చెప్పిన కథ నచ్చి అతడినే దర్శకత్వం చేయమని అడిగాను అయితే కిషోర్ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు దాంతో కిషోర్ కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాం . ఇక హీరోయిన్ గా పలువురిని అనుకున్నాం కానీ రాయ్ లక్ష్మి ని హీరోయిన్ గా ఎంపిక చేసింది నేనే ! ఎందుకంటే థియేటర్ లోపల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ప్రవీణ్ , మధునందన్ లతో పాటుగా మిగతా వాళ్ళు ఉన్నారు కానీ థియేటర్ వరకు ప్రేక్షకులను తీసుకు రావాలంటే రాయ్ లక్ష్మీ నే కరెక్ట్ అని భావించి ఆమెని తీసుకున్నాం .

 

* గ్రామీణ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే చిత్రం మా వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి . తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది . యువతకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా కావడంతో ఖచ్చితంగా హిట్ అవుతుంది .

 

* ఈ సినిమా తర్వాత మరో నాలుగైదు ప్రాజెక్ట్ లు అనుకుంటున్నాం , అయితే ఏవి మెటీరియలైజ్ అవుతాయన్నది త్వరలోనే తెలియజేస్తాను .

 

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TFLbXs

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...