Skip to main content

కీరవాణి పాటతో ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ స్థాయి పెరిగింది : సాయికిరణ్ అడివి

Keeravani's song has raised 'Operation Gold Fish' to a new high: Adivi Saikiran ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని, సినిమాపై ఆసక్తిని పెంచిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్‘. ఆది సాయికుమార్ కథానాయకుడిగా, రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి విశేష స్పందన లభిస్తోంది.

 

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను దగ్గుబాటి రానా విడుదల చేయగా… ఈ సినిమాతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్ ను ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్… సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంత మంది ప్రముఖుల మద్దతు ఇవ్వడంతో చిత్రానికి అదనపు బలం చేకూరింది.

 

ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్ లుక్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి ఆహార్యం ప్రచార చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏంటంటే… ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు పాడిన పాట. సినిమాలో ఓ పాటను ఆయన ఆలపించారు.

 

ఈ సందర్భంగా సాయికిరణ్ అడివి మాట్లాడుతూ “ఈ పాట చిత్రంలోని కీలక సన్నివేశంలో వస్తుంది. చిత్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకువెళ్ళింది. సినిమా స్థాయి పెరిగింది. ఈ పాటకు రామజోగ్గయ్య శాస్త్రి గారు  అద్భుతమైన, విలువలతో కూడిన సాహిత్యాన్ని అందించారు. దేశభక్తిని  పెంచే ఒక గేయాన్ని పెద్ద సింగర్ పాడాలి అనుకుని కీరవాణి గారిని అడగడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే కాదు అనకుండా ఈ పాట పాడడానికి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు” అన్నారు.

 

సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ “పాట చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు అందరినీ భావోద్వేగానికి గురి చేసే పాట ఇది. రామజోగయ్యశాస్త్రి గారు  లిరిక్స్ చాలా బాగా ఇచ్చారు. కీరవాణి గారు మా విన్నపాన్ని మన్నించి పాడారు. ఆయనకు థాంక్స్. ఆయన పాడటంతో పాట స్థాయి పెరిగింది. ఈ పాట నుంచి సినిమా కొత్త మలుపు తీసుకుంటుంది. జనాన్ని ఆలోచింపచేస్తుంది. ఈ పాటలో ఒక సందేశం ఉంటుంది. కీరవాణి గారు పాట విని… ‘చాలా బాగుంది, చేద్దాం’ అన్నారు. ఆయన సంగీతం వింటూ పెరిగాను. నా సంగీతంలో ఆయన పాట పాడడం, పాటను మెచ్చుకోవడం చాలా సంతోషంగా  ఉంది. థాంక్స్ టు కీరవాణి గారు. కీరవాణి గారి గానం పాటకి ఇంకా బలాన్ని చేకూర్చింది” అన్నారు.

 

చిత్ర బృందం మాట్లాడుతూ “అడిగిన వెంటనే కాదు అనకుండా పాట పాడడానికి అంగీకరించిన కీరవాణి గారికి ధన్యవాదాలు తెలుపుతూ పాటని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము” అని తెలిపింది.

 

ఈ చిత్రం లో ఆది సాయికుమార్,  అబ్బూరి రవి, శషా చెత్త్రి , నిత్యా నరేష్, కేరింత నూకరాజు, కార్తీక్ రాజు, మనోజ్ నందం, కృష్ణుడు, అనీష్ కురువిళ్ళ, రావు రమేష్, RJ హేమంత్ ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ చిత్రానికి ఫైట్స్ : రామకృష్ణ, సుబ్బు రాబిన్ – నాబా. లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి,  ఆర్ట్ : JK మూర్తి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ రెడ్డి తుమ్మ, ఎడిటర్ : గ్యారీ BH , సంగీతం : శ్రీచరణ్ పాకాల, DOP : జయపాల్ రెడ్డి, script డిజైన్ : అబ్బూరి రవి, పి.ఆర్.ఓ : నాయుడు – ఫణి,  కో – ప్రొడ్యూసర్ : దామోదర్ యాదవ్ (వైజాగ్), ప్రొడ్యూసర్ : ప్రతిభ అడివి, కట్టా ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ BH, సతీష్ డేగల, Artists & Technicians, కధ, కధనం, దర్శకత్వం : సాయికిరణ్ అడివి.

 

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2TwJrzC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...