Skip to main content

హీరో రాజశేఖర్ కార్ కి ఇప్పటికే 23 చలానాలు

Hero Rajasekhars already fined 23 traffic Challans
Hero Rajasekhars already fined 23 traffic Challans

“ఊరందరికీ శకునం చెప్పే బల్లి చివరికి కుడితి గుంటలో పడి దెబ్బ తగిలించుకుటుంది” అని అప్పట్లో మా తాత గారు చెప్పారు. ఎందుకో,  ఇప్పుడు తెలుగు మాట్లాడడం రాని తెలుగు సినిమా హీరో రాజశేఖర్ విషయంలో ఈ సామెత కనెక్ట్ అవుతోంది.

ప్రస్తుతం మేటర్ లోకి వస్తే, మంగళవారం అర్ధరాత్రి స్థానిక శంషాబాద్ పరిధిలో పెద్ద గోల్కొండ శివార్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర జరిగిన కారు ప్రమాదంలో, హీరో రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి.  ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. సంబంధిత ఘటనలో కార్ లో ఉన్న ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో రాజశేఖర్ కు తీవ్ర ప్రమాదం తప్పినట్లు అయింది. వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే హీరో రాజశేఖర్ మరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మంగళవారం రాత్రి రామోజీ ఫిలిం సిటీ నుండి హైదరాబాద్ కు తన బెంజ్ కార్ TS 07 FZ 1234 లో రాజశేఖర్ స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ బయలుదేరగా, అర్ధరాత్రి ఒంటిగంట 15 నిమిషాల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి కారణం రాజశేఖర్ అతివేగంతో ర్యాష్  డ్రైవింగ్ చేసుకుంటూ రావడమే కారణమని తెలుస్తోంది.

 ప్రధమ చికిత్స చేయించుకొని ప్రెస్ మీట్ లో తాను బాగానే ఉన్నానని అందరికీ ధన్యవాదాలు అని జీవిత తో పాటు కలిసి చెప్పిన రాజశేఖర్, పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వైద్య పరీక్షలకు హాజరయ్యారా.? లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఓవర్ స్పీడ్ కు సంబంధించి రాజశేఖర్ వాహనంపై ఇప్పటికే 23 ట్రాఫిక్ చలానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం ఆయన తల్లి చనిపోయిన నేపథ్యంలో, ఆయన డిప్రెషన్ లో ఉంటున్నారని, అందుకే గతంలో కూడా ఒకసారి ఆయన కారు ప్రమాదానికి గురయ్యారని, ఆయన సన్నిహిత వర్గాలు సంఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  మరి అంత మానసిక ఇబ్బందిలో ఉన్నప్పుడు , కనీసం ఒక డ్రైవర్ ని కూడా పెట్టుకోకుండా  నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఎందుకు ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు.?  అన్న విషయంపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NOxiSV

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...