Skip to main content

తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
తొలిసారి కంఫర్ట్ జోన్ దాటి సినిమా చేయబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ దర్శకులలో ఒకరు. ఈయన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువే. దానికన్నా త్రివిక్రమ్ మాటలు అంటే చెవి కోసుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కేవలం త్రివిక్రమ్ మాటలకోసమే సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కువే. నిజాయితీగా మాట్లాడుకుంటే త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కంటే అవ్వకముందు త్రివిక్రమ్ రచనలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, వాసు, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు.. ఇలా త్రివిక్రమ్ పెన్ను పడిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న పట్టు అటువంటిది. దర్శకుడయ్యాక పెన్ను నుండి వచ్చే చెమకులు కొంచెం తగ్గినా ఇప్పటికీ త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్ కు ఫేమస్. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న పట్టు అటువంటిది. త్రివిక్రమ్ లోని దర్శకుడ్ని, రచయిత కాపాడిన సందర్భాలు కోకొల్లలు.

అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. తన బలమేంటో, బలహీనత ఏంటో త్రివిక్రమ్ కు బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, డ్రామా,యాక్షన్, కామెడీ ఈ జోనర్లను టచ్ చేస్తూనే సినిమా చేస్తూ వస్తున్నాడు. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమా నువ్వే నువ్వే నుండి తను ఇదే పంథాలో సినిమాలు తీస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేస్తున్న లేటెస్ట్ సినిమా అల వైకుంఠపురములో కూడా ఇవే హైలైట్ కానున్నాయి. ఇందులో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్, కామెడీ ప్రధానంగా తీస్తున్నాడు.

అయితే తొలిసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన బలాన్ని విడిచి కొత్త ప్రయత్నం చేయబోతున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాను త్రివిక్రమ్ ప్యాన్ ఇండియాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ కథకు సంబంధించిన లైన్ ఎన్టీఆర్ కు వినిపించడం కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఫ్రీ అవుతాడు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలో జాయిన్ అవుతాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా సినిమా చేయాలనే నిర్ణయించుకున్నాడు కానీ బయట దర్శకులని కన్సిడర్ చేసాడు. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా కమిట్ అవ్వాలని చాలా రోజులు ఆలోచించాడు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి, తన బలం వగైరా అంశాల గురించి అవగాహన ఉన్న తెలుగు దర్శకుడైతే మేలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది.

మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేయబోతున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35tpUCw

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...