Skip to main content

వరుణ్ తేజ్ కోసం ప్లాప్ దర్శకుడ్ని సెట్ చేస్తున్న మెగా నిర్మాత

varun tej to act in flop directors movie
varun tej to act in flop directors movie

మెగా హీరో వరుణ్ తేజ్ మొదటినుండి తన కథల ఎంపికలతో ఇంప్రెస్ చేస్తున్నాడు. మొదటి సినిమానే ఏ మాత్రం కమర్షియల్ అంశాలు లేని ముకుందను ఎంచుకున్న వరుణ్ తేజ్, తర్వాత కూడా కమర్షియల్ పంథాలో నడవకుండా కంచె వంటి అవార్డు విన్నింగ్ సినిమాను చేసాడు. అయితే కథల విషయంలో మధ్యలో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న వరుణ్ తేజ్ తొలిప్రేమ, ఎఫ్ 2, గడ్డలకొండ గణేష్ వంటి రీసెంట్ చిత్రాల విజయాలతో 25 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు.

గద్దలకొండ గణేష్ లో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేసిన వరుణ్ తేజ్, ఈసారి బాక్సర్ అవతారం ఎత్తబోతున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పిన కథకు ఫ్లాట్ అయిన వరుణ్ తేజ్ అతనికి అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బాక్సర్ గా సరైన ఫిజిక్ ను, లుక్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం ప్రారంభమై వేసవికి కానీ, ఆగష్టు నెలలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ ఆ తర్వాతి చిత్రం గురించి కూడా ప్రచారం మొదలైపోయింది.

ప్రస్తుతం చేయనున్న బాక్సర్ చిత్రాన్ని కొడుకు నిర్మిస్తుంటే, ఆ తర్వాతి వరుణ్ సినిమాను తండ్రి నిర్మించనున్నాడట. అవును, అల్లు అరవింద్ నిర్మాణంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే వక్కంతం వంశీ వరుణ్ తేజ్ ను కలిసి ఒక కథ చెప్పాడట. ఆ లైన్ వరుణ్ కు విపరీతంగా నచ్చినట్లు తప్పకుండా ఈ సినిమా అయ్యాక చేద్దామన్నట్లు వార్తలు వచ్చాయి. ఈలోగా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని కూడా వరుణ్ చెప్పినట్లు తెలుస్తోంది.

రచయితగా వక్కంతం వంశీకి టాలీవుడ్ లో అపార అనుభవం ఉంది. కిక్, కిక్ 2, అతిధి, రేసుగుర్రం, టెంపర్ వంటి చిత్రాలకు రచన చేసి మంచి పేరే తెచ్చుకున్న వక్కంతం వంశీ తన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో వక్కంతం వంశీకి వెంటనే మరో సినిమా రాలేదు.

ఈ సినిమా ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ కూడా దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దాని తర్వాత సుకుమార్ సినిమాను కూడా సెట్ చేసాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా ఫలితం తర్వాత వక్కంతం వంశీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోనే ఉన్నాడు. అక్కడే కథలను సిద్ధం చేస్తున్న వంశీకి ఇప్పుడు వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం అవుతుందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2L0zPYj

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...