Skip to main content

రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??

రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??
రాజమౌళి ఆమెనే ఎంచుకోవడానికి కారణమేంటి??

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. దాదాపు ఆరు నెలల నుండి ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు హీరోయిన్ ను అన్వేషిస్తున్న రాజమౌళి తాజాగా ఒలివియా మోరీస్ అనే బ్రిటిష్ స్టేజ్ నటిని ఎంచుకున్నాడు. ఈమె నాటకాలు వేయడమే తప్ప ఏ తరహా సినిమాలోనూ, వెబ్ సిరీస్ లోనూ కనిపించిన దాఖలాలు లేవు. కనీసం ఈమె పేరు మీద అసలు వికీపీడియా పేజీ కూడా లేకపోవడం గమనార్హం. ఈరోజుల్లో చిన్న చిన్న ఆర్టిస్ట్ లకు కూడా వికీపీడియా పేజీ ఉంటున్న కారణంగా మరీ ఇంత తక్కువ స్థాయి నటిని ఎన్టీఆర్ సరసన తీసుకున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుస్సా కూడా అయ్యారు. మరోవైపు ఈమెకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ఇన్స్టాగ్రామ్ లో ఆర్ ఆర్ ఆర్ లో ప్రకటనకు ముందు 9 వేల మంది ఫాలోయర్స్ ఉన్న ఒలివియా అకౌంట్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా 50 వేలకు చేరుకుంది. ఈమె గురించి గూగుల్ లో కూడా తెగ వెతికేశారు. ప్రకటన వచ్చిన రోజు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీగా ఒలివియా నిలిచింది. అయితే ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే రాజమౌళి లాంటి వ్యక్తి, ఎన్టీఆర్ ను తక్కువ చేస్తాడని ఊహించలేం. తక్కువ చేయలనుకున్నా ఇలా ఎక్కడినుండో హీరోయిన్ ను తీసుకొచ్చి ఎందుకు పెడతాడు. దీని వెనకాల కారణం వేరే ఉందని తెలుస్తోంది.

రాజమౌళి రాసుకున్న జెన్నిఫర్ పాత్ర నిడివి కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే ఉంటుందట. పైగా పాత్ర డిమాండ్ మేరకు ఆమెకు సంప్రదాయ నృత్యం వచ్చి ఉండాలి. సంప్రదాయ నృత్యం వచ్చిన విదేశీ నటిని పట్టుకోవడం రాజమౌళి బృందానికి చాలా కష్టమైంది. ముందుగా ఈ పాత్రకు తీసుకున్న డైజీ జోన్స్ ఈ కారణంగానే సినిమా నుండి తప్పుకుంది. ఈ కారణాలతోనే ఒలివియాను జెన్నిఫర్ పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

పైగా రాజమౌళి తీసుకున్నాడంటే అందుకు తగ్గ కారణాలు ఉండే ఉంటాయిగా. ఆ బ్రాండ్ ను నమ్మి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఉండొచ్చు. పాత్ర చిన్నదైనా తనదైన శైలిలో ఎలివేట్ చేయడం రాజమౌళి స్పెషలిటీ. మరి చూద్దాం ఈ సినిమాలో ఆమెకు ఎలాంటి పాత్రనిచ్చాడో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2s9HqgR

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...