Skip to main content

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా
రజినీకాంత్ రేంజ్ మరీ ఇంత పడిపోయిందా

రజినీకాంత్… ఈ పేరుకి అభిమానంతో ఊగిపోయే జనాలు కోట్లల్లో ఉన్నారు. కేవలం ఒక భాషకు పరిమితం చేయగల నటుడు కాదు రజినీకాంత్ అంటే. ఆయన పేరు మీద వందల కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందించాడు రజిని. తెలుగులో కూడా ఈ సూపర్ స్టార్ ఫాలోయింగ్ కు కొదవేం లేదు. ఇక్కడ స్టార్ హీరోలకు సమానమైన క్రేజ్ రజిని సొంతం. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం రజినీకాంత్ కు క్రేజ్ లేదు. కనీసం తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పరిస్థితి ఉంది. వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇదే నిజం. రజినీకాంత్ సినిమాలు ఇప్పుడు తెలుగులో ఆడటం లేదు. గత చరిత్ర వైభవం చెప్పుకుని విడుదల చేసుకోవాల్సిందే కానీ రజినీకాంత్ కు తెలుగులో హిట్ వచ్చి చాలా కాలమైంది. శంకర్ – రజినీకాంత్ క్రేజ్ వల్ల రోబో ఆడింది. రోబో, చంద్రముఖి వంటి సినిమాల తర్వాత రజినీకి ఇక్కడ హిట్ లేదు. అయినా ఇన్నాళ్లూ ఆయన సినిమాలకు బాగానే బిజినెస్ జరిగేది. ఇప్పుడు అది కూడా లేదు.

రజినీకాంత్ రోబో 2.0 కి రోబో, శంకర్ కాంబినేషన్ వల్ల క్రేజ్ బాగానే వచ్చింది. అయితే ఆ సినిమాను భారీ రేట్లకు కొన్న బయ్యర్లకు వర్కౌట్ కాలేదు. దీనికంటే ముందు వచ్చిన కబాలి తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు చుక్కలు చూపించింది. మళ్ళీ అదే దర్శకుడికి అవకాశం ఇచ్చి కాలా తీస్తే అది కూడా ఇంచుమించు అలాంటి ఫలితాన్నే అందుకుంది. బయ్యర్లు ఈ సినిమాలతో భారీ నష్టాలను చూసారు. దీంతో రజినీకి క్రేజ్ తగ్గడం మొదలైంది. అందుకే పేట సినిమాను చాలా తక్కువ ధరకు తెలుగులో విక్రయించారు. అయినా కానీ పేట ఇక్కడ నష్టాలనే అందుకుంది. దీనివల్ల బయ్యర్లలో కూడా కనువిప్పు కలిగింది. ప్రేక్షకులు ఇదివరకటిలా రజినిని తెరపై చూడటానికి ఎగబడిపోవట్లేదని తెలుసుకున్నారు. అందుకే రజినీకాంత్ తాజా చిత్రం దర్బార్ కు ఊహించినంత హంగామా లేదు.

ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావట్లేదు. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. వైజాగ్, నైజాం వరకూ దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకుంటారు. మిగిలిన ఏరియాల్లో హక్కులు అమ్మడానికి ఎవరూ పెద్దగా ముందుకు రాకపోవడం దిల్ రాజును అయోమయానికి గురి చేస్తోంది. రజినీ క్రేజ్ తగ్గడం ఒక కారణమైతే, పోటీగా రెండు పెద్ద సినిమాలు బరిలో ఉండడం అసలు కారణం. సంక్రాంతికి విడుదల కానున్న దర్బార్ కు పోటీగా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బరిలో ఉన్నాయి. సంక్రాంతికి ఈ రెండు సినిమాల మీదే ఎక్కువ అటెన్షన్ ఉంటుంది. ఈ రెండు సినిమాలను చూసిన తర్వాతే ప్రేక్షకుడు ఈ సీజన్ లో మరో సినిమా చూడాలనుకుంటారు. అందుకే పోటీ ఉండకూడదని జనవరి 9కి దర్బార్ రిలీజ్ మార్చారు. అయినా ఆ రెండు రోజులే దర్బార్ కు కలెక్షన్స్ ఉంటాయి. తర్వాత దృష్టాంతా రెండు పెద్ద సినిమాలపైనే ఉంటుంది. అందుకె రజినీ సినిమాను కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2XU9ctu

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...