Skip to main content

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2
ఇండియాలో దూసుకుపోతున్న ఫ్రోజెన్ 2

సీక్వెల్స్ ఎక్కువగా వస్తోన్న 2019లో మరో హాలీవుడ్ యానిమేటడ్ చిత్రం విడుదలైంది. 2013లో వచ్చిన వాల్ట్ డిస్నీ వారి హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ కు సీక్వెల్ గా గత వారం ఫ్రోజెన్ 2 విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్య హాలీవుడ్ సినిమాలు ఇండియా మార్కెట్ పై బాగా దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా యానిమేటెడ్ సిరీస్ అయితే అందులో ప్రముఖ పాత్రలకు ఇండియాలోని టాప్ స్టార్స్ చేత డబ్బింగ్ చెప్పిస్తుండడం బాగా కలిసొస్తోంది. ఈ ఏడాది విడుదలైన ది లయన్ కింగ్ కు ఇలానే చేసారు. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, తెలుగు నుండి నాని, జగపతి బాబు, బ్రహ్మానందం, అలీ వంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ కు డబ్బింగ్ చెప్పి క్రేజ్ తీసుకొచ్చారు. ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం.

ఇప్పుడు ఫ్రోజెన్ 2 విషయంలో కూడా ఇదే చేసారు. ఇందులో ఎల్సా పాత్రకు తెలుగులో నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పింది. అలాగే చిన్నప్పటి ఎల్సా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ చిత్రం ఇప్పుడు ఇండియాలో మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి వీకెండ్ లోనే ఫ్రోజెన్ 2 అదరగొట్టింది. మొదటి మూడు రోజులకే దాదాపు 18 కోట్లను కొల్లగొట్టింది ఫ్రోజెన్ 2. వీక్ డేస్ లో డ్రాప్ కనిపించినా కూడా సినిమా నిలబడింది. మొత్తంగా ఇప్పటివరకూ 25 కోట్ల రూపాయల షేర్ ను దాటింది ఫ్రోజెన్ 2.

2013లో అందరినీ అలరించిన ఫ్రోజెన్ దాదాపుగా 1.28 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడు దాని సీక్వెల్ ఫ్రోజెన్ 2 కూడా తక్కువేం తినలేదు. ఇప్పటికే దాదాపుగా 500 మిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. తొలి పార్ట్ లో ఆకట్టుకున్న ఎల్సా, అన్నా, క్రిస్టోఫ్, ఓలాఫ్ వంటి పాత్రలు, సీక్వెల్ లో కూడా కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఈ సీక్వెల్ లో ఎల్సా కు పవర్స్ ఎలా వచ్చాయి అన్న విషయాన్ని చర్చించారు.

ముఖ్యంగా పిల్లలను ఉద్దేశించి తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుండడం విశేషం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rFa1Kl

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...