Skip to main content

డిసెంబర్ నుండి సెల్లు బిల్లుతో జేబుకి చిల్లి గ్యారంటీ

Call data charges hike from December 1st
Call data charges hike from December 1st

మా అన్నయ్య మహేష్ బాబు  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చెప్పిన ఒక అద్భుతమైన డైలాగ్ ను గుర్తు చేసుకుంటే,

 “ఈ శతాబ్దంలో కనిపెట్టిన అత్యంత ఖరీదైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఇదే (సెల్ ఫోన్).” నిజంగానే సెల్ వచ్చాక మనుషులు కనీసం సాటి మనిషితో మాట్లాడటం తగ్గించేశారు. అన్నం తింటున్నా, బండి నడుపుతున్నా, లేదా అసలు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా చేతిలో సెల్ ఫోను చెవిలో ఇయర్ ఫోన్స్ లేకుండా మనిషి కనబడటం లేదు. 20వ శతాబ్దపు వ్యాపార ఎత్తుగడలలో భాగంగా ఒక మనిషికి అవసరానికి మించి అలవాటు చేయబడిన ఒక వస్తువు సెల్ ఫోన్. అందుకనే ఈ మధ్యనే మా గురువు గారు శంకర్ గారు 2.0 అనే ఒక సినిమా తీసి పనీపాటా లేకుండా ఊరికే సెల్ ఫోన్ వాడే వాళ్లందరిని గట్టిగా వేసుకున్నారు.

సరే ఇప్పుడు మేటర్ లోకి వస్తే, గత కొన్ని సంవత్సరాలుగా చీప్ గా ఇంకా మాట్లాడాలంటే డెడ్ చీప్ గా సెల్ ఫోన్ సేవలు సౌకర్యాలు ఉపయోగించుకున్న మన సమాజంలోని ప్రజలకు తొందరలో షాక్ తగలబోతోంది. వచ్చే నెల అనగా, డిసెంబర్ 1నుంచి ఛార్జీలను పెంచుతున్నట్లు అన్నిరకాల టెలికాం కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. అదేమంటే స్వయ్యాన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు వసూలు చేస్తున్న దానిలో కనీసం 20 శాతానికి పెంచి వసూలు చేసుకోమన్నట్లుగా సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్ కాల్ డేటా మరియు అన్ లిమిటెడ్ ఆఫర్ ఏదైనా కానీ, ఇప్పుడున్న టారిఫ్ లో కనీసం 20 శాతం అయినా పెరిగే అవకాశం ఉంది.

ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా సెల్ ఫోన్లు కొనుగోలు తగ్గటం, సెల్ ఫోన్ ల రేట్లు పెరగటం,  అదేవిధంగా బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు తగ్గటం, ఆన్ లైన్ షాపింగ్ లు కూడా తగ్గటం ఇలా సెల్ ఫోన్ అనే ఒక బుల్లి వస్తువు మీద ఆధారపడిన ఒక పెద్ద మాఫియా అందరికీ వ్యాపారాలు తగ్గటం జరిగే అవకాశం ఉంది. మరి దీనికి కూడా ఫిక్స్ అయ్యి, రేట్లు పెంచడానికి సిద్ధమయ్యాయి మన టెలికాం కంపెనీలు.

ఉద్యోగులకు మొన్నటిదాకా ఊరికే వేలు లక్షల జీతాలు మింగపెట్టి, ఇప్పుడు పతివ్రత కబుర్లు చెబుతున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కూడా పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది. డిసెంబరు 1 నుంచి బీఎస్ఎన్ఎల్ కూడా చార్జీలను పెంచడం ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే డిసెంబర్ 1వ తేదీ నుంచి కాలింగ్ డేటా చార్జీలు పెంచుతున్నట్టు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్, జియో సంస్థలు ప్రకటించాయి. ఇప్పటికే ఇతర నెట్ వర్క్ నెంబర్లకు చేసే కాల్స్ పై  ఐసీయూ ఛార్జీలను వసూలు చేస్తున్న జియో, మరొకసారి డేటా చార్జీలు,కాల్ చార్జీలు పెంచిన ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 ఏం చేస్తాం వ్యవస్థలను కంట్రోల్ లో పెట్టవలసిన వాళ్లు కుక్క బిస్కెట్లకు అమ్ముడు పోతున్నారు కదా.!



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/3360GbC

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...