Skip to main content

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం
ఖైదీ ఆన్లైన్ రిలీజ్ పై తమిళనాట దుమారం

ఓటిటి ప్లాట్ఫార్మ్స్… అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటివన్నమాట. ఇవి వచ్చాక ప్రేక్షకులు సినిమాలు చూసే పద్దతి మారిపోయింది. అసలు కొన్ని సినిమాలకు అమెజాన్ వంటి వాటిలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తున్నారు. సినిమా పోస్టర్ మీదే ఆ సినిమా ఎక్కడ విడుదలవుతుందో వేస్తుండడంతో జనాలు ఆ చిత్రం ఆన్లైన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడమనేది బొత్తిగా తగ్గిపోయింది. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఎప్పటినుండో గొడవ చేస్తున్నాడు. నెల రోజుల్లోనే సినిమాను డిజిటల్ గా రిలీజ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వడం వల్ల థియేటర్ లో సినిమా చచ్చిపోతుందని సురేష్ బాబు అంటూనే ఉన్నాడు. నిర్మాతలు అందరూ ఈ విషయంలో కలిసి రావాలని కనీసం మూడు నెలలు ఆ ఓటిటి ప్లాట్ఫామ్స్ లో విడుదల కాకుండా చూడాలని, చిన్న సినిమాలకైతే పర్లేదు కానీ మీడియం బడ్జెట్, కొంచెం పేరున్న సినిమాలకు ఈ పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుందని వాపోయాడు. ఇప్పుడు కాదు గత ఏడాదిన్నర కాలం నుండి సురేష్ బాబు ఈ విషయంలో మొత్తుకుంటూనే ఉన్నాడు.

అయితే నిర్మాతలు భారీ స్థాయిలో డబ్బులు చూస్తుండడంతో సురేష్ బాబు వంటి పెద్దల మాటలను పెడచెవిన పెట్టారు. మీడియం బడ్జెట్ సినిమాలకే 10 కోట్ల దాకా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తుండడంతో సులువుగా పెట్టుబడి తిరిగి రాబట్టుకోవచ్చని చెప్పి నిర్మాతలు సినిమాలను వాళ్ళకే నెల రోజుల్లోపు స్ట్రీమ్ చేసుకోమని కట్టబెట్టేసారు. అయితే దాని దుష్పరిణామాలు ఇప్పుడు నిర్మాతలు అనుభవిస్తున్నారు. నెమ్మదిగా ఒక్కొక్కరికీ ఇది ఎంత చేటు చేస్తుందనేది అర్ధమవుతోంది. థియేటర్ కు వచ్చే జనాల సంఖ్య దారుణంగా తగ్గిపోతోంది. దీని వల్ల థియేటర్లు అన్నీ వీకెండ్ దాటగానే వెలవెలబోతున్నాయి. సినిమా అనేది ఇప్పుడంతా వీకెండ్ బిజినెస్ అయిపోయింది. తాజాగా కార్తీ నటించిన ఖైదీ తమిళ వెర్షన్ ఇలా ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో రావడం పెద్ద దుమారమే రేపింది.

దీపావళికి విడుదలైన ఈ సినిమా సరిగ్గా నెల రోజులకు హాట్ స్టార్ లో దర్శనమిచ్చింది. దీనిపైఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఈ సినిమా తమిళ్ లో బాగా ఆడుతోంది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కూడా అవుతున్నాయి. సినిమా ఇంత బాగా ఆడుతున్నప్పుడు అసలు ఎలా డిజిటల్ లో రిలీజ్ చేసేస్తారని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ఉచితంగా సినిమా చూసుకునే అవకాశం ఉన్నప్పుడు థియేటర్ దాకా ఎవడొస్తాడని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామ్ ముత్తురామ్ మల్టీప్లెక్స్ ఓనర్లు అయితే తమ దగ్గర ఈ సినిమా మూడు షో లకు రెండు హౌస్ ఫుల్స్ అవుతున్నాయని ఇప్పుడు ఇలా ఆన్లైన్ రిలీజ్ చేయడం చూసి షాకయ్యామని అంటున్నారు. అయితే ఖైదీ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు మాత్రం పైరసీ పెరిగిపోతుండడంతో కలెక్షన్ల పై ప్రభావం పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాడు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QXkFqx

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...