Skip to main content

కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది

కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది
కింగ్ కోహ్లీ మాటలకు లిటిల్ మాస్టర్ కు మండింది

లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ టీమిండియా క్రికెట్ లో ఒక లెజండ్. తొలిసారి భారత్ తరుపున టెస్ట్ క్రికెట్ లో 10,000 పరుగుల మార్క్ ను అందుకుని చరిత్ర సృష్టించాడు. టీమిండియా ఎన్నో మరపురాని విజయాల్లో భాగమయ్యాడు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా, అనలిస్ట్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్నాడు సన్నీ. స్వతహాగా చాలా కూల్ గా ఉండే సన్నీకి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల వల్ల కోపం వచ్చింది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా సారధి. మూడు ఫార్మాట్లలోనూ జట్టుని ముందుండి నడిపిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలను సాకారం చేస్తున్నాడు. వ్యక్తిగతంగానూ కోహ్లీ సాధించిన పరుగుల రికార్డులు ఎన్నోన్నో. ఏకంగా సచిన్ రికార్డులకు ఎసరు పెట్టగల స్థాయిలో కోహ్లీ ప్రభంజనం కొనసాగుతోంది. వ్యక్తిగతంగా దూకుడుగా ఉండే కోహ్లీ, సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి కోహ్లీ మాటలకు సన్నీకి ఎందుకు కోపం వచ్చిందో ఒకసారి చూస్తే..

ఇటీవలే టీమిండియా బాంగ్లాదేశ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెల్సిందే. దీంతో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో వరసగా 7 విజయాలు సాధించింది అన్ని జట్ల కంటే అత్యధికంగా 360 పాయింట్లు గెలుచుకుని అగ్ర స్థానంలో కొనసాగుతోంది. విజయాలు సాధించడమే కాదు ప్రత్యర్థి జట్లపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తూ అఖండ విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. దీనిపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ సౌరవ్ గంగూలీ సారధ్యంలోని జట్టు దూకుడుగా ఎలా ఆడాలో, ప్రత్యర్థులను ధీటుగా ఎలా ఎదుర్కోవాలో చూపించింది. మేమంతా ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య సన్నీ గవాస్కర్ కు కోపం తెప్పించింది.

ప్రతిఒక్కరూ గంగూలీ జట్టే విజయాలు సాధించింది అన్న తరహాలో మాట్లాడుతుంటారని, టీమిండియాకు దూకుడు అప్పుడే మొదలైందన్న భ్రమలో ఉంటారని, అయితే తాము ఆడుతున్నప్పుడు కూడా ఎన్నో విజయాలు అందుకున్నామని గవాస్కర్ గుర్తుచేశాడు. హేమాహేమలైన జట్లను తోసిరాజని 1983లోనే వరల్డ్ కప్ సాధించామని అంటున్నాడు. 70, 80లలో టీమిండియా సాధించిన అద్భుత విజయాలు ఎన్నో ఉన్నాయని, బహుశా విరాట్ కోహ్లీ అప్పటి పుట్టకపోయి ఉండడం వల్ల తెలీకపోవచ్చని, అవన్నీ తెలీకుండా గంగూలీ సారధ్యలోనే టీమిండియా విజయాలు సాధించడం మొదలైంది అన్నట్లుగా మాట్లాడడం సరికాదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి తనను ప్రసన్నం చేసుకోవడం కోసం విరాట్ కోహ్లీ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని దుయ్యబట్టాడు.

మొత్తానికి గవాస్కర్ విమర్శలపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. నిజానికి టీమిండియా దూకుడు అన్న మాట రాగానే ఈ తరం వాళ్లకు సౌరవ్ గంగూలీ నాయకత్వమే గుర్తొస్తోంది. 70, 80 ల కాలంలో టీమిండియా ఆటను అందరూ మర్చిపోయారు. అలా అని గంగూలీని తక్కువ చేయడానికేం లేదు. అంతకు ముందు స్లెడ్జింగ్ అంటే మనవాళ్ళు భయపడేవారన్న మాట వాస్తవం, గంగూలీ సారధి అయ్యాకే మన వాళ్ళు దూకుడుగా సమాధానం చెప్పడం మొదలైంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DfMKkK

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...