Skip to main content

పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు

పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు
పారితోషికాలతో బెదరగొడుతున్న హీరోలు, దర్శకులు

సినిమా ఇండస్ట్రీ అనేది ఎన్ని మాట్లాడుకున్నా ఒక బిజినెస్. ఒక నిర్మాత అనేవాడు ముందుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీస్తాడు? సినిమా అనేది అందరికీ ప్యాషనే కావొచ్చు. కానీ ప్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఆ నిర్మాతకు లాభాలు లేకపోయినా కేవలం ప్యాషన్ తోనే సినిమాలు నిర్మిస్తూ వెళ్ళిపోతాడా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కేవలం నిర్మాత ఒక్కడే లాభపడినా కూడా లాభం లేదు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలీకుండా కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, ట్రైలర్ వంటివి చూసి ఆ సినిమాను నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్ కూడా లాభపడాలి. అతని నుండి ఎగ్జిబిటర్ కూడా లాభాలు చూడాలి. ఈ మోడల్ అంతా సక్రమంగా జరిగితేనే తర్వాతి సినిమాకు డబ్బు ధైర్యంగా పెట్టగలడు నిర్మాతైనా, డిస్ట్రిబ్యూటరైనా, ఎగ్జిబిటరైనా!

ఇదివరకు సినిమా బిసినెస్ మోడల్ వేరుగా ఉండేది. అప్పట్లో నిర్మాత చేతిలో మేకింగ్ అంతా ఉండేది. నిర్మాత, దర్శకుడు కలిసి సినిమా ఎలా ఉండాలో నిర్ణయించేవారు. హీరో కేవలం వారు చెప్పేది విని నడుచుకునేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పెద్ద హీరోలైనా కూడా వారు నిర్మాతలు, దర్శకులు పట్ల వినమ్రంగా నడుచుకునేవారు. అందుకే అప్పట్లో సినిమా మేకింగ్ అదుపులో ఉండేది. తన సినిమాకు ఎంత పెట్టాలో నిర్ణయించుకునే అధికారం నిర్మాత చేతుల్లో ఉంది కాబట్టి రిస్క్ తక్కువగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా భారీ నష్టాలు అయితే వచ్చేవి కావు.

అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేకింగ్ అంతా నిర్మాత చేతుల్లోంచి జారిపోయింది. హీరో, దర్శకుడు ఒక్కటైపోయారు. పారితోషికాలే సగం బడ్జెట్ ను ఆక్రమించేస్తున్న పరిస్థితి. అందులో కేవలం హీరో, దర్శకుడి పారితోషికమే దాదాపు మూడు వంతులు ఉంటుంటే ఇక నిర్మాత ఎలా సేఫ్ అయ్యేది. బడ్జెట్ పెరుగుతుండడంతో బిజినెస్ ను కూడా పెంచుతున్నారు. పెద్ద సినిమాల విషయంలో నిర్మాత సేఫ్ అవుతున్నా బయ్యర్లు నిండా మునిగిపోతున్నారు. ఒకవేళ సినిమా బాగున్నా వచ్చే లాభాలు ముందు నష్టపోయిన వాటిని పూడ్చుకోవడంతోనే సరిపోతుంది.

ఉదాహరణకు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలనే తీసుకుంటే.. అయిన బడ్జెట్ లో సగం మహేష్ బాబు-అనిల్ రావిపూడి, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లకే అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనిల్ రావిపూడికి దాదాపు 10 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారట. ఇక మహేష్ గురించి చెప్పేదేముంది. సరిలేరు నీకెవ్వరులో పార్ట్నర్ కాబట్టి పారితోషికం కింద నాన్ థియేట్రికల్ హక్కులు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

అల వైకుంఠపురములో విషయానికి వస్తే అల్లు అర్జున్ సొంత  సంస్థ గీతా ఆర్ట్స్ ఇందులో నిర్మాణ భాగస్వామి. అయినా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాకు 25 కోట్ల దాకా ముట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎప్పట్లానే 20 కోట్లు వచ్చాయట. ఇలా 45 కోట్ల దాకా ఇద్దరి పారితోషికాలకే వెళ్లిపోతుంటే, మిగతా వారి పరిస్థితి ఏంటి, సినిమాను ఎంతలో తీయాలి. ఆ హీరో, దర్శకుడికి ఉన్న క్రేజ్ ను బట్టి నిర్మాత కూడా డబ్బులు పెడుతున్నాడు కానీ లాస్ వస్తే జేబులు గుల్లవుతున్నాయి.


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35nuT7O

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...