Skip to main content

బాలకృష్ణ, రోజా… జరిగే పనేనా?

 

Boyapati want to cast Roja as villain
Boyapati want to cast Roja as villain

నందమూరి బాలకృష్ణ, రోజా అంటే 90లలో సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మెజారిటీ సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అందుకే ఈ జంటను స్క్రీన్ పై చూడాలని ప్రేక్షకులు కూడా కోరుకునే వారు. వీరిద్దరూ కలిసి భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత రోజా నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడం, అటుపై అవి కూడా తగ్గించేసి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తుండడం జరుగుతూ వస్తోంది. మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ముందు టిడిపిలోనే పనిచేసిన ఇద్దరూ తర్వాత రోజా వైసిపికి వెళ్లడంతో ప్రత్యర్ధులయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే బాలకృష్ణ ప్రతిపక్ష పార్టీలో ఉంటే, రోజాది అధికార పక్షం. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జబర్దస్త్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రోజా పలు సందర్భాల్లో బాలకృష్ణపై వాడివేడి వ్యాఖ్యలు చేసింది. ఆయన ప్రవర్తనను తప్పుపట్టింది. ఇప్పుడు అధికార పక్షం కాబట్టి విమర్శలు చెయ్యట్లేదు. రాజకీయ పరంగా ఇద్దరి మధ్యనా దూరం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇదంతా ఎందుకంటే ఒక దర్శకుడు వీరిద్దరినీ పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు బోయపాటి శ్రీను.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ రూలర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైపోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ బోయపాటి  శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రాగా రెండూ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. సో ఈసారి హ్యాట్రిక్ ఎలాగైనా మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారు. ఈ చిత్రంలోనే రోజాని విలన్ గా నటింపజేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బోయపాటికి కలిగిందిట. ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్ళను, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న వాళ్ళను మళ్ళీ తన సినిమాల్లో నటింపజేయాలనుకుంటాడు బోయపాటి.

అందుకే లెజండ్ లో జగపతి బాబుని విలన్ ను చేసి సూపర్ క్రేజ్ ను తీసుకొచ్చాడు. సరైనోడులో శ్రీకాంత్ కు ముఖ్య పాత్ర ఇచ్చాడు, ఆదిని విలన్ ను చేసాడు. అలాగే జయ జానకి నాయకలో శరత్ కుమార్ ను తీసుకొచ్చాడు. వినయ విధేయ రామలో స్నేహ, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లాంటి వాళ్ళను తీసుకున్నాడు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న రోజాను విలన్ చేయాలని భావిస్తున్నాడు. అయితే రోజా ఇందుకు సముఖంగా లేకపోయినా బోయపాటి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోజా కనుక ఎస్ అంటే ఈ సినిమాకు క్రేజ్ ఇంకా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారు సినిమాలో ఢీ అంటే ఢీ అనే పాత్రలను పోషిస్తే ప్రేక్షకులలో ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2L2HxRY

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...