Skip to main content

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు
సైరా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సీనియర్ నటుడు

సీనియర్ నటుడు గిరిబాబు ఎన్నో విలక్షణమైన పాత్రలతో, అటు విలన్ గా, ఇటు కమెడియన్ గా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. ప్రస్తుతం అతని కొడుకు రఘుబాబు ఇండస్ట్రీలో క్యారెక్టర్ నటుడిగా ఫుల్ బిజీగా ఉంటోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే గతంలో గిరిబాబు చిరంజీవికి వ్యతిరేకంగా కొన్ని ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తన కొడుకు బోసు బాబు సినిమా విషయంలో చిరంజీవి అండ్ కో కావాలనే తొక్కేశారని, అందువల్లే తన కొడుకు సినిమా ఆడకుండా పోయిందని, కెరీర్ కూడా నాశనమైందని వాపోయాడు. ఇదిలా ఉంటే ఇటీవలే మరో ఇంటర్వ్యూలో గిరి బాబు సైరా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక్కోసారి చిరంజీవిని ప్రశంసిస్తారు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా గుర్తిస్తారు, మరేందుకు కొన్నిసార్లు విమర్శిస్తారు. అసలెందుకిలా అని ప్రశ్నించగా దానికి గిరిబాబు ఆసక్తికర సమాధానం చెప్పాడు.

గిరిబాబు మాట్లాడుతూ తన చిరంజీవితో విబేధాలు ఏం లేవని, ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, చిరంజీవితో నేను ఎన్నో సినిమాల్లో కలిసి నటించాను. తనతో నాకెందుకు ఇబ్బందులు ఉంటాయి. నిజానికి నేను చిరంజీవిని చాలా అభిమానిస్తాను. అతను చాలా మంచి వ్యక్తి. నాతో ఎప్పుడూ బాగుంటాడు, నన్ను ఆత్మీయంగా పలకరిస్తాడు. నేను చిరంజీవిని ఎప్పుడూ విమర్శించలేదు. ఒకానొక సందర్భంలో తన కొడుకు బోసుబాబు సినిమా విషయంలో చిరంజీవి నిర్మాతలు చేసిన పనిని విమర్శించాను. నేను అప్పుడు అన్నది చిరంజీవి నిర్మాతలను,చిరంజీవిని కాదు అని చెప్పుకొచ్చాడు.

అలాగే సైరా సినిమా గురించి కూడా స్పందించాడు గిరిబాబు. తాను సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూశానని, చిరంజీవి చాలా అద్భుతంగా నటించాడని చెప్పాడు. ఆ విషయం చిరంజీవికి కూడా చెప్పా. సినిమా అద్భుతంగా తీశావని అభినందించా.అయితే ఈ సినిమా ఎక్కువ ఆడకపోవచ్చని కూడా అన్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ వేడి లేదు. అప్పట్లో కాబట్టి అల్లూరి సీతారామరాజు సినిమా చూసారు, ఇప్పుడు చూడరు. ఇప్పుడు అందరికీ బాహుబలి వంటి సినిమాలు కావాలి. లేదా పాక్ కు వ్యతిరేకంగా సినిమా తీయాలి. ఫైట్లు, డ్యాన్సులు వంటివి ఉన్నా ఇష్టపడతారు. స్వతంత్రం రావడానికి 200 ఏళ్ల క్రితం నాటి కథను ఎక్కువ మంది ఆదరించకపోవచ్చని అభిప్రాయపడ్డాను.

నిజానికి సైరా నరసింహారెడ్డికి టాక్ బ్రహ్మాండంగా వచ్చింది, రివ్యూలు, మౌత్ టాక్ కూడా ఇదొక మంచి సినిమా అని పొగిడేశారు. అయితే కలెక్షన్స్ పరంగా మాత్రం సైరా నరసింహారెడ్డి ఫెయిల్ అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అధిక రేటు కారణంగా బ్రేక్ ఈవెన్ సాధించలేదు. తెలుగులో నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసి తన పేరిట రాసుకుంది. అయినా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిల్చింది. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QWxKjU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...