Skip to main content

చిరు సినిమాపై ఆ రూమర్లలో నిజమెంత?

syeraa buyers to be benefited with megastar 152 project
syeraa buyers to be benefited with megastar 152 project

మెగాస్టార్ చిరంజీవి తన పదేళ్ల కలని సైరా నరసింహారెడ్డి రూపంలో నెరవేర్చాడు కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తండ్రి ప్రేమపై మక్కువ మార్కెట్ కు ఎంత స్కోప్ ఉంది, ఎంతవరకు బిజినెస్ చేయొచ్చు అంటూ వ్యాపార లెక్కలు వేయకుండా చేతికి ఎముక లేని చందంగా ఖర్చుపెట్టేసాడు. దర్శకుడు ఏది అడిగితే అది సమకూర్చి దాదాపు 200 కోట్లు పెట్టి సైరాను తెరకెక్కించాడు రామ్ చరణ్.

తీరా సినిమాను మార్కెట్ చేసే విషయంలో ఘోరంగా విఫలమై చతికిలపడ్డారు. కంటెంట్ పరంగా సైరాను తీసి పడేయడానికి లేదు. బాహుబలి రేంజ్ లో ఫైట్స్ డిజైన్ చేసాడు సురేందర్ రెడ్డి. రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలకు కూడా లోటు లేదు. అయితే పోటీగా వేరే భాషల్లో సినిమాలు విడుదల కావడం సైరాకు ప్రతికూలంగా మారింది. ముఖ్యంగా హిందీలో వార్ విడుదలై 300 కోట్లు కొల్లగొట్టి సైరాను సైడ్ చేసేసింది.

దాంతో హిందీలో ఈ సినిమా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళ లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. మిగతా భాషల్లో సినిమా ప్లాప్ అయినా తెలుగులో అయినా హిట్ అవుతుందనుకున్నారు. మెగాస్టార్ తిరుగులేని ఇమేజ్, పాట్రియాటిక్ ఫీల్ వెరసి సైరా ఒక అద్భుతమైన ఫీల్ ను అయితే తీసుకొచ్చింది కానీ తెలుగులో ఈ సినిమా సేఫ్ వెంచర్ అవ్వలేకపోయింది నైజాం, సీడెడ్ లో తప్పితే ఈ సినిమా అన్ని చోట్లా దాదాపు 25 శాతానికి మించి నష్టపోయినట్లు తెలుస్తోంది.

నైజాంలో 30 కోట్లకు పైగా సైరా షేర్ తెచ్చుకుని సేఫ్ వెంచర్ అనిపించుకుంది. సీడెడ్ లో దాదాపు 18 కోట్ల దాకా వచ్చాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ ను అందుకుంది. అయితే మార్కెట్ కన్నా ఎక్కువ బిజినెస్ చేయడంతో వసూలు చేయడం కష్టమైంది. తాజా సమాచారం ప్రకారం సైరా కొనుక్కుని నష్టపోయిన బయ్యర్లకు మెగాస్టార్ 152వ సినిమాతో న్యాయం చేయబోతున్నారట.

నిజానికి ఈ పద్దతి ఇప్పటిది కాదు, ఎప్పటినుండో ఉన్నదే. ఒక సినిమా పోతే, ఆ తర్వాతి సినిమాకు తక్కువ రేట్లకు హక్కులు కట్టబెట్టడమో లేక ప్లాప్ అయ్యాక కొంత భర్తీ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే సైరాతో తాము పూర్తి సంతృప్తిగా ఉన్నామని రామ్ చరణ్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెల్సిందే. దాంతో సైరాను కొని నష్టపోయిన బయ్యర్లకు సహాయపడాలని మెగాస్టార్, మెగా పవర్ స్టార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందుకే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హక్కులను సైరా సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకే కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. దానికి తోడు కొరటాల శివ – చిరంజీవి సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించి బయ్యర్లకు లాభాలు వచ్చేలా హక్కులను అమ్మాలని ప్లాన్ చేసారు. బయ్యర్ల బాగోగుల కోసం ఇంతలా ఆలోచిస్తాడు కాబట్టే మెగాస్టార్ అయ్యాడు అని అతని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2s4WCf3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...