Skip to main content

కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్

కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్
కష్టాల ఊబిలో ప్రయాణిస్తున్న గోపీచంద్

మొదట్లో విలన్ వేషాలతో ప్రేక్షకులకు చేరువైన గోపీచంద్, తర్వాత హీరోగా మారి తనదైన ముద్ర వేసాడు. వరసగా సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన గోపీచంద్ తనకంటూ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే గోపీచంద్ ఇటీవలే హిట్ ఇచ్చి చాలా కాలమైంది. లౌక్యం తర్వాత గోపీచంద్ సక్సెస్ చూసిందే లేదు. ఈ ఐదేళ్ళలో చాలా సినిమాలే చేసిన గోపీచంద్ ఒక్కటంటే ఒక్క సక్సెస్ సినిమా కూడా అందించలేదు. కనీసం యావరేజ్ సినిమా కూడా స్కోర్ చేయలేదు. గోపీచంద్ నుండి వచ్చిన లాస్ట్ రెండు సినిమాలు పంతం, చాణక్య అయితే మరీ ఘోరం. కలెక్షన్లలోనే కొత్త లో ను నమోదు చేసాయి. గోపీచంద్ కంటూ ఇప్పుడు ఒక మార్కెట్ లేదు. అయితే ఇంకా అతని సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో ఎంతో కొంత వస్తోంది కాబట్టి అరకొర నిర్మాతలైనా గోపీచంద్ కు అందుబాటులో ఉన్నారు.

ప్రస్తుతం కెరీర్ ను మళ్ళీ రివైవ్ చేసుకునే పనిలో పడ్డ గోపీచంద్ తాజాగా తన మేనేజర్ ను తీసేశాడని తెలుస్తోంది. ఈ మేనేజర్ గోపీచంద్ తో ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. చాలా సినిమాలకు కూడా ఉన్న ఆ మేనేజర్ ను గోపీచంద్ తప్పించడం వెనకాల గోపీచంద్ ఫెయిల్యూర్స్ ఒక కారణమట. తనకు సరైన సినిమాలు రానివ్వకుండా చేశాడన్న కారణంతో గోపీచంద్ ఆ మేనేజర్ ను తప్పించినట్లు తెలుస్తోంది. కొన్ని మంచి కథలు తనదాకా రాకుండా చేసాడని అనుకుంటున్నాడు గోపీచంద్. అయితే ఇందులో ఆ మేనేజర్ తప్పు కన్నా గోపీచంద్ స్వయం కృతాపరాధమే ఎక్కువున్నట్లు ఎవరికైనా అర్ధమవుతుంది.

కేవలం కథల ఎంపికలో గోపీచంద్ చేసిన పొరబాట్లే తన ఫెయిల్యూర్స్ కు కారణమని ఇప్పటికీ తను గ్రహించినట్లు అనిపించట్లేదు. లౌక్యం తర్వాత మన యాక్షన్ హీరో కథల ఎంపికలో చాలానే తప్పులు చేసాడు. ప్రేక్షకులు తన నుండి ఎలాంటి సినిమా ఆశిస్తున్నారో తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. పైగా అందరూ కొత్తదనం అంటూ అటువైపు అడుగులు వేస్తున్న సమయంలో గోపీచంద్ ఇంకాఆ పాత చింతకాయ పచ్చడి అంటూ అదే తరహా సినిమాలు, యాక్షన్ అంటూ అవే సీన్లు చేయడం అతడికే శాపంగా మారింది. చాణక్య అంటూ స్పై థ్రిల్లర్ అని చెప్పి, కమర్షియల్ అంశాల పేరిట జరిగిన ట్రాజెడీ మనందరం చూసాం.

ఇప్పటికైనా గోపీచంద్ కళ్ళు తెరవకపోతే చాలా కష్టం. ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. టాప్ దర్శకులతోనే అవసరం లేదు, కనీసం మీడియం బడ్జెట్ లో టైర్ 2 లో ప్రామిసింగ్ దర్శకులతో జట్టు కట్టినా సరిపోతుంది. అలా కాదని తన ఇమేజ్, తెలుగు ప్రేక్షకుల అభిరుచి పట్ల అవగాహన లేని తమిళ దర్శకులతో పని చేసి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు గోపీచంద్.

ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నందితో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. దర్శకుడు సంపత్ నంది కాబట్టి కొత్తదనం ఆశించాల్సిన అవసరం లేదు. అయితే దీని తర్వాత రెండు కథలను విన్నాడు. అవైనా గోపీచంద్ కు మంచి చేయాలని కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35z8dS0

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...