Skip to main content

“నేను ఇక జబర్దస్త్ కి రాను” – మెగా బ్రదర్ నాగబాబు

Nagababu Confirmed his quit from Jabardasth
Nagababu Confirmed his quit from Jabardasth

గత కొద్ది రోజులుగా బుల్లితెర రియాలిటీ షో అయిన జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు తప్పు కుంటున్నారని వస్తున్న వార్తలలో నిజా నిజాలు ఏంటో తెలియక చాలామంది తర్జన భర్జన పడుతున్నారు. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఇకపై జబర్దస్త్ లో తాను కనపడని అంటూ మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేసిన ఒక వీడియో లో తాను వచ్చే వారం నుంచి ఇకపై ప్రతి గురువారం శుక్రవారం ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలలో జడ్జి గా వ్యవహరించనని తాను కొన్ని కారణాల దృష్ట్యా తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు.

తాను జబర్దస్త్ షో నుంచి వైదొలగడం వెనకాల ఎవరి పాత్ర లేదని, తను ఇష్టపూర్వకంగానే బయటకు వచ్చానని, దీని వెనకాల ఎవరి బలవంతం లేదని, దీనిపై ఎవరూ అనవసరం అయినటువంటి వివాదాలు కాంట్రవర్సీలు సృష్టించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

నాగబాబు మాట్లాడుతూ, ఏడున్నర సంవత్సరాల క్రితం తాను వ్యక్తిగతంగా మరియు వృత్తి పరంగా కొంత స్తబ్దత లో ఉన్నప్పుడు, ఈ టీవీ మరియు మల్లెమాల వారు తనను మొదట అదుర్స్ ఆ తర్వాత జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించమని కోరారని, వాడు తన కి ఇచ్చే పారితోషికం తన స్థాయికి ఏమాత్రం తగినది కాకపోయినా, తాను స్నేహపూర్వకంగా చేస్తూ వచ్చారని చెప్పారు. ఈ టీవీ యాజమాన్యానికి మరియు మల్లెమాల సంస్థ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి తనకు ఎంతగానో సహకరించారని వాళ్ళను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని తెలియజేశారు.

అయితే ఏ కార్యక్రమానికైనా ఎక్కడో ఒకచోట ముగింపు ఉంటుందని తాను ముగింపు వరకు ఉండాలని కోరుకోవడం లేదని, ఆ కార్యక్రమం ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతను బయటకు రావాలని కోరుకున్నానని, అయితే గతకొద్దికాలంగా మల్లెమాల మరియు ఈటీవీ యాజమాన్యాలతో తనకు కొన్ని వ్యాపార పరమైన విభేదాలు వచ్చాయని, అందువల్లే తాను బయటకు వచ్చి వేరే కార్యక్రమాలకు వెళ్తున్నానని నాగబాబు వివరించారు.

షో లో సాంకేతిక నిపుణులు మరియు తన కో జడ్జి రోజా సెల్వమణి తో తనకు ఎటువంటి విభేదాలు లేవని వారు తనకు జీవితాంతం స్నేహితులుగా ఉంటారని నాగ బాబు స్పష్టం చేశారు. జబర్దస్త్ తోపాటు ఈటీవీలో మల్లెమాల ప్రొడక్షన్స్ తరుపున ఎన్నో విజయవంతమైన షో లు డిజైన్ చేసిన సంజీవ్ కుమార్ కొన్ని విభేదాల కారణంగా జబర్దస్త్ మొదలు పెట్టిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు బయటకు వెళ్లి మాటీవీలో “మా టాకీస్” అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఆ కార్యక్రమం అంత విజయవంతం కాకపోయినా, అప్పుడు జబర్దస్త్ లో ఉండే యాంకర్ అనసూయ తో పాటు అనేక మంది టీం లీడర్లు బయటకు వెళ్లిపోయారు. ఆ సమయంలో షోను సక్సెస్ చేసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని మెగాబ్రదర్ నాగబాబు కొత్త టీమ్ లీడర్ లను ఏర్పాటు చేసి మళ్లీ జబర్దస్త్ కు పునర్వైభవం తీసుకు వచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ లు నిలబడతాయా.? లేక వాటిని డామినేట్ చేయడానికి ఇతర చానల్స్ సిద్ధం చేస్తున్ కార్యక్రమాలు నిలబడతాయా.? తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35pHIOH

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...