Skip to main content

స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే

స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే
స్వచ్ఛమైన గాలి కేవలం రూ.299  మాత్రమే

అన్నిటికంటే గొప్ప వ్యాపారం ఏది.?  అని నాలాంటి అమాయకుడు ఒకసారి ప్రపంచాన్ని అడిగాడట..

అప్పుడు ప్రపంచం ఇచ్చిన సమాధానం.

“పంచభూతాలు అయినటువంటి గాలి నేల నీరు నిప్పు ఆకాశం వీటికి సంబంధించిన వ్యాపారం ఏదైనా గాని అద్భుతంగా  ఉంటుంది.”

ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఇవన్నీ పొందే హక్కు ఉంది.  కానీ అత్యాశతో స్వార్థంతో బతికే కొంతమంది నీచులు సహజ వనరులను తమ గుప్పెట్లో ఉంచుకుని మిగిలిన అటువంటి ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు.

అందరికీ అర్థమయ్యేలా ఇలాంటి విషయాలు చెప్పాలని అప్పటికీ మా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ తో జల్సా అనే సినిమా చేశారు.  కానీ పవన్ కళ్యాణ్ ఓవరాక్షన్ వల్ల అందులో కంటెంట్ జనానికి ఎక్కలేదు.

ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే, దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది.  ఎవడికైనా ఇంకొకరి మీద పగ ఉండి ప్రతీకారం తీర్చుకోవాలి అనిపిస్తే,  ఎక్కువ కష్టపడకుండా ఢిల్లీకి తీసుకెళ్లి ఎటువంటి మాస్కులు లేకుండా ఢిల్లీ వాతావరణంలో పొద్దుటి నుండి నుంచి సాయంత్రం వరకు తిప్పితే మరుసటి రోజుకి ఎవడు అదృష్టం కొద్దీ వాడికి రోగాలు వచ్చి…

అంటే అదే..  ఎందుకులే చెప్తే బాగోదు.

జీవనదులు పారే ఈ దేశంలో మంచినీళ్లు సీసాలో పెట్టి లీటర్ల లెక్కన అమ్ముతూ వచ్చిన మన ఆధునిక సమాజం, ప్రస్తుతం మరొక మెట్టు పైకి ఎక్కింది.  అదే గాలి వ్యాపారం.

దేశ రాజధాని ఢిల్లీలో “ఆక్సి ప్యూర్” అనే పేరుతో ఆక్సీజన్ అమ్మే ఒక దుకాణం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.  ఢిల్లీ పరిధిలోని సాకేత్ అనే ప్రాంతంలో ఉన్న ఈ దుకాణంలో ఆర్య వీరకుమార్ అనే ఒక వ్యక్తి పెట్టిన ఈ దుకాణంలో 15 నిమిషాలపాటు స్వచ్ఛమైన గాలిని 299 రూపాయలు పెట్టి పీల్చుకోవచ్చట.

ఇంకా నీచాతి నీచమైన విషయం ఏమిటంటే, ఈ స్వచ్ఛమైన ఆక్సిజన్ లో ఏడు రకాల ఫ్లేవర్లు కూడా దొరుకుతాయిట.  గాలిలోని నైట్రోజన్ తొలగించడం ద్వారా ఆక్సి ప్యూర్ బార్ లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ పీల్చుకోవచ్చని ఈ వ్యాపారవేత్త కొత్త వ్యాపారానికి తెర తీశాడు.

మన చిన్నప్పుడు ఇంటర్నెట్ అంత సులభంగా దొరకని రోజుల్లో పది రూపాయలు పెట్టి 15 రూపాయలు పెట్టి గంటకి ఇంటర్నెట్ కి వెళ్లి పని చూసుకొని వచ్చేవాళ్ళం  కదా. మరి ఇంటర్నెట్ ఇప్పుడు ఉచితంగా లభిస్తుంది. భగవంతుడు ప్రసాదించిన స్వచ్ఛమైన గాలి మాత్రం ఉచితంగా దొరకడం లేదు.  ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా.

ఇప్పుడు స్టైల్ గా జనాలందరూ మంచినీటి సీసాలు చేతిలో పట్టుకుని తిరుగుతున్నట్టు, మరో ఇరవై పాతిక సంవత్సరాలలో జనాలు స్వచ్ఛమైన గాలిని సీసాల్లో నింపుకొని తిరిగితే తప్ప బతకలేని పరిస్థితి వస్తుంది అని నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది.

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33O4lw3

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...