Skip to main content

రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది

రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది
రాహుల్ ను తురుమ్ రా! బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే కుమ్మేసింది

బిగ్ బాస్ సీజన్ 3 ఎట్టకేలకు ముగిసింది. ఎన్నో హంగుల మధ్య జరిగిన బిగ్ బాస్ ఫినాలే ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. 105 రోజుల ప్రయాణం చివరికి వచ్చింది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ టాప్ 2 కు వెళ్లగా, రాహుల్ బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచాడు. వరసగా మూడో సారి కూడా అబ్బాయే గెలవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి శ్రీముఖి ఫైనల్స్ కు వెళ్ళగానే ఒక్క అమ్మాయే వెళ్ళింది కాబట్టి ఈసారి ఆమే గెలుస్తుంది అనుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 లో శివబాలాజీ గెలవడం, సీజన్ 2 లో కౌశల్ విన్ అవ్వడంతో సీజన్ 3 అమ్మాయికి ఇస్తారని ఆశ పడ్డారు. కానీ ప్రేక్షకుల తీర్పు వేరుగా ఉంది. అమ్మాయా, అబ్బాయా అన్నది చూడకుండా అభిమానులు తమ మనసుకు నచ్చిన కంటెస్టెంట్ కే ఓటు వేశారు.

బిగ్ బాస్ అనేది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇందులో ఉండే హంగులు మాములుగా ఉండవు. మాములు టాస్క్స్ లోనే బిగ్ బాస్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఫినాలే అంటే ఎలా ఉంటుందో మాములుగా చెప్పాలా? షో మొదలవ్వడమే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ నంబర్స్ తో అదిరిపోయేలా సాగింది. ఇక ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో షో లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారితో సరదాగా కబుర్లు చెప్పాడు. మరోవైపు హౌజ్ లో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్, అలీ, వరుణ్ సందేశ్ లు హౌజ్ లో టెన్షన్ పడుతూ కూర్చున్నారు. బిగ్ బాస్ ఫైనల్స్ ఎలా జరుగుతుంది అన్నది చాలా మందికి ఐడియా ఉంది. ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో ఒక్కొక్కరినీ ఎలిమినేట్ చేస్తూ వస్తారు. ఒక్కొక్కరిని డిఫరెంట్ పద్దతులతో ఎలిమినేట్ చేస్తూ జనాలను టెన్షన్ లో ముంచెత్తుతారు.

ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే మరికొంత విభిన్నంగా. ఈసారి సెలబ్రిటీల ద్వారా ఎలిమినేషన్ జరగడం కొత్తగా ఉంది. మొదటి ఎలిమినేషన్ చేయడానికి ప్రతిరోజూ పండగే హీరోయిన్ రాశి ఖన్నా, దర్శకుడు మారుతి బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చి ఫస్ట్ ఎలిమినేషన్ చేసారు. కొంచెం టెన్షన్ పెడుతూ ఫస్ట్ ఎలిమినేట్ అయిన కాండిడేట్ అలీ అని చెప్పి అతణ్ణి తీసుకుని హౌజ్ లో నుండి బయటకు వచ్చేసారు. ఇక సెకండ్ ఎలిమినేషన్ చేయడానికి శ్రీకాంత్ వచ్చాడు. ఇక్కడ ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు నాగార్జున. ఇద్దరం కలిసి నాలుగు సినిమాలు చేసాం అని శ్రీకాంత్ అంటే కాదు మొత్తంగా ఐదు సినిమాలు చేసాం హలో బ్రదర్ సినిమాలో నా డూప్ గా చేసాడు శ్రీకాంత్ అని చెప్పాడు నాగార్జున. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే శ్రీకాంత్ కూడా ఇంట్లోకి వెళ్ళాడు సెకండ్ ఎలిమినేషన్ చేయడానికి. కాకపోతే ఈసారి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌజ్ లోకి 20 లక్షలు పంపాడు. ఎవరైతే టైటిల్ గెలవరు అనుకుంటున్నారో వారు ఈ 20 లక్షలు పట్టుకుని వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అయితే ఎవరూ కూడా తమ క్యారెక్టర్ ను జడ్జ్ చేస్తారేమో అన్న భయంతో డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. శ్రీకాంత్, కొద్దిసేపు టెన్షన్ తర్వాత వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. క్యాథెరిన్ కూడా హౌజ్ లోకి వచ్చి హల్చల్ చేసింది. దానికి ముందు ఆమె చేసిన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. వరుణ్ ను ఒక స్టేజ్ లో అందరూ టైటిల్ విన్నర్ అనుకున్నారు. కానీ లాస్ట్ డల్ అయిపోయి వరుణ్ ఓటమి కొనితెచ్చుకున్నాడు. ఇక బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేయడానికి అంజలి హౌజ్ లోకి వచ్చింది. ఈసారి కూడా సూట్ కేస్ తో 25 లక్షలు పట్టుకొచ్చి బిగ్ బాస్ టెంప్ట్ చేసే ప్రయత్నం చేసినా అది జరగలేదు. ఎవరూ డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు.

ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎలిమినేషన్ కోసం నాగార్జున స్వయంగా రంగంలోకి దిగాడు. ఇంట్లోకి వచ్చి రాహుల్, శ్రీముఖిను హౌజ్ లో నుండి స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. ఇక బిగ్ బాస్ లో అసలైన అట్రాక్షన్ మెగాస్టార్ చిరంజీవి రాక. చిరంజీవి స్టేజ్ మీద చేసిన హడావిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరు హౌజ్ మేట్స్ ను గుర్తుపట్టి వారి మీద పంచ్ లు వేస్తూ, ఆట పట్టిస్తూ ఓ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ పంచాడు.

ఇదంతా అయిపోయిన తర్వాత రాహుల్ ను విన్నర్ గా ప్రకటించడంతో బిగ్ బాస్ సీజన్ 3 కు తెరపడింది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WFW62r

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...