Skip to main content

భీష్మ రిలీజ్ విషయంలో తప్పు చేస్తున్నారా?

Bheeshma Releasing in off season can be a Setback
Bheeshma Releasing in off season can be a Setback

హ్యాట్రిక్ ప్లాపుల తర్వాత యంగ్ హీరో నితిన్ కొన్ని నెలల గ్యాప్ తీసుకుని వరస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఒకటికి అయిదు సినిమాలకు కమిటయ్యాడు నితిన్. బహుశా నితిన్ అంత బిజీగా ప్రస్తుతం ఏ నటుడూ లేడేమో. 2021 వేసవి వరకూ నితిన్ డైరీ ఖాళి లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం భీష్మ పూర్తి చేసే బిజీలో ఉన్నాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకీ కుడుముల నుండి రెండో ప్రయత్నంగా వస్తున్న చిత్రమిది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 20కి విడుదల చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే వెంకీ అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేకపోతుండడంతో ఏ మాత్రం బిజీ లేని ఫిబ్రవరి 21కి విడుదలను షిఫ్ట్ చేసారు. ఎందుకంటే జనవరి అంతా సంక్రాంతి సినిమాలు, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలయ్యే సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దాంతో ఎవరూ బుక్ చేసుకోలేదని ఫిబ్రవరి 21 మీద కర్చీఫ్ వేశారు. మహాశివరాత్రి సెలవు ఈ చిత్రానికి కలిసొస్తుందని వాళ్ళ నమ్మకం.

గతంలో చూసుకుంటే ఫిబ్రవరిలో కొన్ని హిట్లు ఉన్నా కానీ ఆ నెల పెద్దగా టాలీవుడ్ కు కలిసి రాదనే చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా పరీక్షల సీజన్ కావడంతో సినిమాలకు మహారాజా పోషకులైన యూత్ పెద్దగా థియేటర్లవైపు రాని పరిస్థితి. అసలే రిపీట్ వేల్యూ లేక ఎక్కువ కాలం థియేటర్లలో సినిమా ఆడించలేని పరిస్థితిలో ఈ నెలలో సినిమా విడుదల చేస్తే ఎలా అంటూ బయ్యర్లు వాపోతున్నారు. అలా అని భీష్మ ఏమీ తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా కూడా కాదు.

ఈ చిత్రానికి పాతిక కోట్ల వరకూ బిజినెస్ జరుగుతుందని అంచనా, మరి ఇంత బిజినెస్ ను ఆఫ్ సీజన్ లో విడుదల చేస్తే పెట్టుబడి తిరిగి రాబట్టగలదా అన్నది ఆలోచించుకోవాలి. అందుకే మరో రెండు నెలలు విడుదల వాయిదా వేసి ఏప్రిల్ లో సినిమాను విడుదల చేసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగు ఏప్రిల్ లో ఒకటీ అరా సినిమాలు తప్ప ఏవీ ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు.

గతంలో నితిన్ నటించిన ఇష్క్ ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ సాధించింది. అలాగే వెంకీ కుడుముల మొదటి చిత్రం ఛలో కూడా ఫిబ్రవరిలో విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్టే. ఈ సెంటిమెంట్ కలిసొస్తుందని ఫిబ్రవరి రిలీజ్ అనుకుంటున్నారేమో, భీష్మకు జరిగిన బిజినెస్ లో సగం కూడా ఈ రెండు సినిమాలకు జరగలేదు. అందుకే ఈ రెండు త్వరగా ప్రాఫిట్స్ లోకి వచ్చేసాయి. మరి భీష్మ విషయంలో సెంటిమెంట్ వర్కవుటై సూపర్ హిట్ అవుతుందా లేక ఆఫ్ సీజన్ వల్ల దెబ్బవుతుందా అన్నది చూడాలి.

ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన స్మాల్ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32L5naD

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...