Skip to main content

మళ్ళీ అటూ ఇటూ చూస్తున్న పవన్

no clarity for pawan on movies
no clarity for pawan on movies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు. ఇక సినిమాలు అసలు చేయనని వాటి మీద తనకు ఆసక్తి కూడా లేదని వివరించాడు. అయితే రాజకీయాల్లో అనుకున్నట్లుగా తను సక్సెస్ సాధించలేకపోయాడు. రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా పరాజయాన్ని పొందాడు. జనసేనకు కేవలం ఒకటే స్థానం దక్కింది. ఈ నేపథ్యంలో పవన్ కు ఉన్న రాజకీయ అనిశ్చితిని క్యాష్ చేసుకుందామని సినిమా వాళ్ళు ప్రయత్నించారు. గత ఆరు నెలలుగా పవన్ ను సినిమాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.

కారణాలు ఏవైనా కానీ పవన్ కళ్యాణ్ మొత్తానికి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ లో పవన్ నటించడానికి సమ్మతం తెలిపాడు. వెంటనే క్రిష్ కూడా పవన్ కు ఒక కథ చెప్పి ఓకే చేయించేసుకున్నాడు. ఇంకేముంది, ఎవరికి వారు పవన్ తో సినిమాలు చేయించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసేసారు. పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్నాడని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చాలా మంది పవన్ తన అన్న బాటలోనే నడుస్తున్నాడని, త్వరలోనే జనసేన కూడా విలీనమైపోతుందని విమర్శలు చేసాడు. ఈ విమర్శలు చూసిన పవన్ మళ్ళీ రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నాడు. సినిమాల గురించి అడుగుతుంటే నోరు మెదపట్లేదు. గత రెండు మూడు రోజులుగా అధికార పక్షం పైనే ఘాటు విమర్శలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు.

ఈ పరిణామాలు చూసిన సినిమా వాళ్ళు పవన్ తో వచ్చిన ఇబ్బంది ఇదేనని, కచ్చితంగా ఒక దాని మీద స్టాండ్ అవ్వట్లేదు, సినిమాలు చేయనని చెప్పేస్తే ఏ గొడవా ఉండదు, చేస్తానని అంటాడు ఎప్పటినుండో తేల్చడు అంటూ విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఏదొక స్టాండ్ తీసుకుని ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Xf0CFm

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...