Skip to main content

టాలీవుడ్ కమెడియన్లతో ప్లాప్ హీరో సినిమా

Sandeep Kishan producing a film with Tollywood Comedians
Sandeep Kishan producing a film with Tollywood Comedians

యంగ్ హీరో సందీప్ కిషన్ ను అందరూ ప్లాప్ హీరో అని సంభోదిస్తున్నారిప్పుడు. దానికి మన యంగ్ హీరో కూడా ఏం ఫీలవ్వట్లేదని తన లేటెస్ట్ సినిమా తెనాలి రామకృష్ణతో మంచి హిట్ కొడతానని, అప్పుడు తన పేరు మారిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సందీప్ కిషన్ హిట్టు కొట్టి చాలా కాలమైంది. దీంతో తన మార్కెట్ కూడా పూర్తిగా దెబ్బతింది. రీసెంట్ సినిమా నిను వీడని నీడను నేనే తనను ప్లాపుల నుండి అయితే బయటపడేయగలిగింది కానీ దాన్ని హిట్ కేటగిరీలో వేయాలం. అందుకే తెనాలి రామకృష్ణ హిట్ అవ్వడం సందీప్ కు చాలా ముఖ్యం. ఈ సినిమాను కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించాడు. అయితే ఈయన కూడా అసలు ఫామ్ లో లేడు. అసలు ఈ పేరుతో ఒక దర్శకుడు ఉన్నాడని జనాలకు గుర్తుచేయాల్సిన పరిస్థితి. హీరోయిన్ హన్సిక గురించి చెప్పేదేముంది. తెలుగులో ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు తమిళంలో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ తెనాలి రామకృష్ణ చిత్రం హిట్ అవ్వడం అత్యవసరం. నవంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రానికి బజ్ అయితే బానే ఉంది. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకుంది. మరి సినిమా ఏమవుతుందో చూడాలి.

సందీప్ కిషన్ ఈ సినిమాను బానే ఓన్ చేసుకున్నాడు. ప్రమోషన్స్ విషయంలో గట్టిగానే ఉన్నాడు. ఇక నిన్ననే హీరోయిన్ హన్సికతో కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ షో నిర్వహించాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. నిను వీడని నీడను నేనే చిత్రంతో నిర్మాతగా మారిన సందీప్ కిషన్ ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలను లీడ్ గా పెట్టి ఒక సినిమాను నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలిసింది. కామెడీ చిత్రాలకి ఆదరణ బాగుండడంతో సందీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు తెలియజేస్తానంటున్నాడు. మరి నిర్మాతగా రెండో ప్రయత్నంలో సందీప్ విజయం సాధిస్తాడా లేదా అన్నది చూడాలి.

ఇక సందీప్ కిషన్ ప్రస్థానం చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెల్సిందే. అవార్డు విన్నింగ్ చిత్రంగా ప్రస్థానం బోలెడన్ని ప్రశంసల్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ లకు ఈ చిత్రం ద్వారా మంచి పేరొచ్చింది.

అయితే ఇదే ప్రస్థానంను అదే పేరుతో ఒరిజినల్ ను తెరకెక్కించిన దేవా కట్టా దర్శకుడిగా సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తే అది దారుణమైనఫలితాన్ని అందుకుంది. ఎందుకిలా అయింది అని సందీప్ ను ఒకరు ప్రశ్నించగా.. అప్పట్లో ప్రస్థానం కొత్త కథ. అందుకే అందరూ ఆదరించారు. ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్ లో తీశారు. ఈలోపు ఇలాంటి కథలు బాలీవుడ్ లో చాలా వచ్చేసి ఉంటాయి కదా. అందుకే జనాలు కూడా ఓల్డ్ గా ఫీలైనట్టున్నారు. అందుకే ఆడలేదు అని కుండబద్దలు కొట్టేసాడు సందీప్ కిషన్.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33NJ9pP

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...