Skip to main content

మీడియం బడ్జెట్ సినిమాలతో కిందామీదా పడుతున్న మైత్రి

 

Mythri Movie Makers medium budget films are flops
Mythri Movie Makers medium budget films are flops

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ టాలీవుడ్ లో దూసుకొచ్చిన బాణం అని చెప్పవచ్చు. రావడం రావడమే మూడు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇచ్చిందీ సంస్థ. మూడూ కూడా ముగ్గురు టాప్ స్టార్స్ తో చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాలుగేళ్లలో చేసినవి మూడే సినిమాలు. అయితేనేం మూడూ కూడా అందరికీ భారీగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ మూడు సినిమాలు ఏమిటో ఈపాటికే మీకు అర్ధమై ఉందిగా. తొలి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు చేసారు. మహేష్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది శ్రీమంతుడు. ఇక రెండో సినిమా కొరటాల శివ దర్శకత్వంలోనే ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ తెరకెక్కించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇక మూడో సినిమా రామ్ చరణ్ కెరీర్ లో అతిపెద్ద హిట్ రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది రంగస్థలం. 2018లో ఈ సినిమా విడుదలైంది.

అయితే అప్పటివరకూ టాప్ స్టార్స్ తో చేసిన మైత్రి ఎక్కడా ఇబ్బంది పడలేదు. కానీ 2018లో మీడియం బడ్జెట్ సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుని బొక్కబోర్లా పడింది. మీడియం బడ్జెట్ లో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకపోవడం గమనార్హం. ముందుగా 2018లోనే నాగ చైతన్య హీరోగా సవ్యసాచి తెరకెక్కింది. ఒక ఆసక్తికర కథాంశం ఉన్నా సరిగ్గా తీయకపోవడం వల్ల సవ్యసాచి ఫెయిల్ అయింది. ఇక దాని తర్వాత చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఫలితం గురించి మాట్లాడుకోకపోవడమే ఉత్తమం. అంత పెద్ద ప్లాప్ అయింది ఈ సినిమా. అమర్ అక్బర్ ఆంటోనీని కొనుక్కున్న వాళ్ళు నట్టేట మునిగిపోయారు.

అయితే 2019లో చిత్రలహరి ద్వారా ఓ మోస్తరు విజయం సాధించి కొంత ఊరట పొందింది మైత్రి. కానీ వెంటనే ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ విఫలమవడం మైత్రికి పెద్ద ఎదురుదెబ్బ. న్యాచురల్ స్టార్ నానితో రీసెంట్ గా చేసిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా నష్టాలు తప్పలేదు. ఈ రకంగా మైత్రి సంస్థ గత ఏడాది నుండి నష్టాలే ఎక్కువ చవిచూస్తోంది. ప్రస్తుతం మైత్రి మూవీస్ ఆశలన్నీ సుకుమార్ – అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి. ఈ సంస్థ నష్టాలను కొంతైనా పూడ్చుకోవాలంటే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే.

ఇదిలా ఉంటే మరో మీడియం బడ్జెట్ సినిమా మైత్రి గుండెల్లో గుబులు రేపుతోంది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఉప్పెన ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం బడ్జెట్ పరిమితులు దాటి వెళ్లిపోయిందని తెలుస్తోంది. కొత్త హీరో, కొత్త దర్శకుడు ఉండడంతో బిజినెస్ పరంగా క్రేజ్ కూడా లేదు. డెఫిసిట్ లో విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి. మరి మైత్రి మూవీస్ కు 2020 ఎలా ఉంటుందో చూడాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33ViGXt

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...