Skip to main content

ఈషా రెబ్బా ట్రైలర్ లో అబ్బా..! అనిపించిందిగా

ఈషా రెబ్బా ట్రైలర్ లో అబ్బా..! అనిపించిందిగా
ఈషా రెబ్బా ట్రైలర్ లో అబ్బా..! అనిపించిందిగా

రాగల 24 గంటలలో ఏం జరుగుతుంది.? సత్యదేవ్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్ లుగా శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న సినిమా “రాగల 24 గంటలలో”. ఈ సినిమా థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయింది. అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బ్రదర్స్ చందనా సిస్టర్స్ లాంటి కామెడీ సినిమాలు తీసిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి నాగార్జున తో డమరుకం అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆయన రీసెంట్ మూవీ మోహన్ బాబు అల్లరి నరేష్ ఇద్దరు కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ “మామ మంచు అల్లుడు కంచు.”

ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వం లో వస్తున్న “రాగల 24 గంటల్లో” సినిమా పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా కనబడుతోంది. ట్రైలర్ చూస్తే మనకి అర్థమయ్యేది ఏమిటంటే ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక కొత్త జంట. హఠాత్తుగా హీరో చనిపోతాడు. హీరో మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో సాల్వ్ చేసే క్రమంలో మిగిలిన పాత్రలు ఎదురవుతాయి.

అప్పుడెప్పుడో రవితేజ నిప్పు సినిమా లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించిన తమిళ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో, డమరుకం సినిమాలో విలన్ గా నటించిన గణేష్ వెంకట్రామన్ ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బెస్ట్ బడ్డీ కమెడియన్ కృష్ణభగవాన్ గారు చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా ఇలా అన్నిట్లో వేలు పెడుతున్న రఘు కుంచె ఈ సినిమా కి సంగీతం అందించారు.

ట్రైలర్ చివర్లో, “నా భర్తను నేనే చంపాను”… ఈషా రెబ్బా క్యారెక్టర్ చెప్పడం కొసమెరుపు. సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నటించిన త్రిగధ చౌదరి బికినీ ధరించిన సీన్ లు ఈ ట్రైలర్ లో వాడారు. సినిమా డిజిటల్ మీడియా లో ప్రమోషన్ మొత్తం ఈషా రెబ్బా గ్లామర్ ని base చేసుకుని చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా హిట్ అయి హీరో సత్య దేవ్ హీరోయిన్ ఈషా రెబ్బ లతో పాటు చాలా కాలంగా హిట్ లేని సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి కూడా help అయితే అదే చాలు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32qYSJS

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...