Skip to main content

వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన నితిన్

nitin lines up 3 movie releases in 8 months
nitin lines up 3 movie releases in 8 months

యంగ్ హీరో నితిన్ కెరీర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వస్తే హిట్లు లేదంటే ప్లాపులు.. ఏదైనా కానీ వరసగా వచ్చేస్తాయి. ఒక్కసారి హిట్ కొట్టడానికి దాని తర్వాత అన్నీ వరస హిట్సే. అదే ప్లాప్స్ ఇవ్వడం మొదలుపెడితే ఇక అవి కూడా అంతే. వరసగా వచ్చేస్తాయి. మరో హీరో అయితే నితిన్ కొట్టినన్ని ప్లాప్స్ కి ఈపాటికే ఎప్పుడో సైడ్ అయిపోయేవాడు. ఒకానొక దశలో ఏకంగా దశాబ్దానికి పైగా వరసగా 14 సినిమాలు ప్లాపులు వచ్చాయి నితిన్ కి. అన్ని ప్లాపులు స్టార్ హీరోలు కూడా తట్టుకోలేరేమో. ఈరోజుల్లో వరసగా మూడు, నాలుగు ప్లాపులొస్తేనే సైడ్ అయిపోతున్నారు. అలాంటిది 14 ప్లాపులొచ్చి కూడా ఇంకా నితిన్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఇష్క్ తో మళ్ళీ కొట్టిన నితిన్ మళ్ళీ కొంత కాలం వెనక్కి తిరిగి చూసింది లేదు. హిట్స్ మీద హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ.. ఆ సినిమా కూడా చేసాడు. నితిన్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిందీ చిత్రం.

ఇక కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది అన్న సమయంలో నితిన్ మళ్ళీ ప్లాపుల బాట పట్టాడు. ఒకటికి మూడు సినిమాలు, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం.. ఇలా హ్యాట్రిక్ ప్లాపులు రాంగ్ టైమ్ లో ఇచ్చాడు. ఈ దెబ్బతో కెరీర్ ను ఏకంగా ఏడాదిన్నర పాటు పక్కనపెట్టేశాడు. సినిమాల నుండి కొంచెం టైమ్ తీసుకుని అసలు ఏం చేస్తున్నాడో సమీక్షించుకున్నాడు.

ఏడాది పాటు కనీసం ఒక్క కథ కూడా వినకుండా గడిపేశాడు. అందుకే ఈ ఏడాది నితిన్ నటించిన చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ఏడాదిన్నర తర్వాత నితిన్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీగా కాలం గడిపేయనున్నాడు. ఒకటి కాదు రెండు కాదు వరసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఎనిమిది నెలల కాలంలో మూడు సినిమాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది కాలంలో నాలుగు సినిమాలు.. అంటే నాలుగు నెలలకో సినిమా వచ్చేలా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నాడు.

నితిన్ ఇప్పుడు భీష్మ చిత్రాన్ని కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. ఈ చిత్రం మొదట క్రిస్మస్ కు అనుకున్నా ఇప్పుడు ప్రేమికుల రోజున నాడు విడుదల కానుంది. భీష్మ తర్వాత ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన వెంకీ అట్లూరి చిత్రం రంగ్ దే సినిమాను పూర్తి చేస్తాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యేలా చూడాలని కోరాడు. దాని తర్వాత దసరాకి లేదా దీపావళికి నితిన్ తన తర్వాతి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. రంగ్ దే తర్వాత నితిన్ టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేయనున్న విషయం తెల్సిందే. ఇవి కాకుండా నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే చిత్రాన్ని కూడా మొదలుపెడతాడట. ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో ఆరంభమవుతుంది. ఇది రెండు చిత్రాల సిరీస్ గా రూపొందించాలని అనుకుంటున్నారు. ఈ రకంగా నితిన్ డైరీ 2019లో ఫుల్ బిజీగా ఉండనుంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NnVviF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...