Skip to main content

అవిశ్రాంత అయోధ్య యోధుడు పరాశరన్

Senior Advocate K.Parasaran
Senior Advocate K.Parasaran

అయోధ్య కేసులో హిందూ సంస్థల తరపున వాదించిన న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ K. పరాశరన్, ఒక్కసారిగా యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 93 ఏళ్ళ వయసులో అవిశ్రాంతంగా ఆ శ్రీరాముడి కోసం అంటే రామ్ లల్ల విరాజ్ మాన్ తరఫున వాదించారు.

 అయోధ్య స్థలం పై సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పు చెబుతున్నప్పుడు పరాశరన్ గారు కోర్టు హాలులో మొదటి వరుసలో కూర్చుని, చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చదువుతున్న తీర్పును ఏకాగ్రతతో విన్నారు.  తీర్పు అయిన తరువాత ఇతర న్యాయవాదులు అందరూ ఒక్కసారిగా పరాశరన్ గారి దగ్గరకు వచ్చి ఆయన అభినందనలతో ముంచెత్తారు. అందరూ ఆయనకు ఫోటో కోసం పర్మిషన్ అడగగా పరాశరన్ గారు వారికి అనుమతి ఇచ్చారు.

 రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం లో ఆయన 40 రోజుల పాటు అవిశ్రాంతంగా జరిగిన వాదోపవాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ 40 రోజులలో ఒక్కసారి కూడా ఆయన సహనం కోల్పోలేదు.  ముస్లిం సంస్థల తరపున వాదిస్తున్నన్యాయవాది రాజీవ్ ధావన్  గారు కొన్నిసార్లు అసహనంతో కొన్ని పత్రాలు చించివేసినా, పరశరన్ గారు శాంతం గానే ఉన్నారు.  గత నెల 16వ తేదీన రాజ్యాంగం ధర్మాసనం వాదనలు ముగిసిన తర్వాత, కోర్టు బయట రాజీవ్ ధావన్ ను కలిసి, ఒక న్యాయవాదిగా తాము కక్షిదారులు పక్షాన మాత్రమే పోరాడతామని, బయట తమ మధ్య ఎటువంటి ఘర్షణ లేదని ప్రపంచానికి తెలియచేసారు.

న్యాయవాది పరాశరన్ గారు తమిళనాడులోని శ్రీరంగంలో ఒక అయ్యగారు వేద బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. పరాశరన్ గారు 1958లో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుండి 1989 వరకు దేశ అటార్నీ జనరల్ గా పనిచేసారు. ఆయన అందించిన అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చింది. ఆయన వాదించిన ప్రతిష్టాత్మక కేసులలో రామసేతు మరియు శబరిమల కేసులు కూడా ఉన్నాయి.

8 నెలలపాటు అవిశ్రాంతంగా ప్రతిరోజు ఉదయం 10:30 గంటలకు కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానానికి హాజరయ్యే పరాశరన్ గారు సాయంత్రం 4 లేదా 5 గంటల వరకు వాదనలు వినిపించే వారు. ఆయనకు సహకరించిన న్యాయవాదుల బృందంలో పీవీ యోగేశ్వరన్,  అనిరుద్ శర్మ, శ్రీధర్ పొట్టరాజు, అదితి దాని, అశ్విన్ కుమార్ డి.ఎస్, భక్తి వర్ధన్ సింగ్ ఉన్నారు.  గత నెల 16 వ తేదీన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పరాశరన్ గారిని మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజన్ అవార్డుతో సత్కరించారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2X0LET7

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...