Skip to main content

ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు

ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు
ఎన్టీఆర్, మహేష్ లతో చెలగాటమాడుతున్న కేజిఎఫ్ దర్శకుడు

ప్రశాంత్ నీల్ అంటే ఎవరు అనే సందేహం వచ్చినా కెజిఎఫ్ దర్శకుడు అనగానే మంచి డైరెక్టర్ అనే భావన సాధారణ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఒక్క సినిమాతో భాషతో సంబంధం లేకుండా అందరి అభిమానాన్ని చూరగొన్నాడు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన ప్రశాంత్ మీద టాలీవుడ్ కన్ను త్వరగానే పడింది. కెజిఎఫ్ విడుదలైన కొన్ని రోజులకే ఇక్కడి బడా స్టార్స్ నుండి ప్రశాంత్ కు ఎంక్వయిరీలు మొదలయ్యాయి. మాకు సూట్ అయ్యే కథ ఏదైనా ఉందా వెంటనే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం అంటూ రాయబారాలు కూడా నడిపారు. అలా ప్రశాంత్ గురించి ఆరా తీసిన మన హీరోల్లో ఫస్ట్ ఎన్టీఆర్ అయితే తర్వాత మహేష్. గత కొన్ని నెలల్లో ఈ ఇద్దరినీ ప్రశాంత్ హైదరాబాద్ వచ్చి మరీ కలిసాడు. దాంతో మా హీరోతో కెజిఎఫ్ దర్శకుడు సినిమా అంటే లేదు మా హీరోతో అంటూ ఎవరికి వారీ ఎగ్జైట్ అవుతున్నారు.

ప్రశాంత్ నీల్ ఇప్పుడు కెజిఎఫ్ 2 షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరిలో ఒకరితో ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందన్నది మాత్రం కన్ఫర్మ్. అయితే అది ఎన్టీఆర్, మహేష్ లలో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే దర్శకుడ్ని ఇదే విషయం ఆయా హీరోలు అడిగితే ఇద్దరితోనూ మీతోనే సినిమా అని చెప్తున్నాడట. ఈ విషయంపై ప్రశాంత్ ఎప్పటికీ తేల్చట్లేదు కాబట్టి ఎన్టీఆర్ ఇక త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం నడుస్తున్న అల వైకుంఠపురములో కమిట్మెంట్ పూర్తవ్వగానే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటాడని చెబుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి జులైకి కానీ ఫ్రీ అవ్వడు. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కథ సిద్ధం చేసుకోవడానికి ఆరు నెలల సమయం ఉందన్నమాట.

మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరు కంప్లీట్ అవ్వగానే మరో సినిమా ఒప్పుకోకుండా నాలుగైదు నెలలు బ్రేక్ తీసుకుంటాడని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ విషయాన్ని నమ్రత ధృవీకరించింది కూడా. ఈ గ్యాప్ ప్రశాంత్ నీల్ కోసమేనని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ నుండి ఫ్రీ అయ్యి మరో సినిమా మొదలుపెట్టడానికి కనీసం మే అవుతుంది. అప్పటిదాకా మహేష్ ఈ దర్శకుడి కోసం వెయిట్ చేస్తాడన్నమాట. చూద్దాం మరి ప్రశాంత్ నీల్ ఆలోచన ఏ విధంగా ఉందో.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O1RdMX

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...