Skip to main content

ఆ బడ్జెట్ లో నిఖిల్ అండ్ కో వల్ల అవుతుందా?

limited budget proposed for karthikeya 2
limited budget proposed for karthikeya 2

యంగ్ హీరో నిఖిల్ కెరీర్ ప్రస్తుతం ఏమంత బాలేదు. ఈ మధ్య నిఖిల్ నటించిన సినిమాలేవీ అంతలా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన రీమేక్ అర్జున్ సురవరం ఇంకా విడుదలకు నోచుకోలేదు. నెలలకు నెలలు వాయిదా పడి మొత్తానికి నవంబర్ 29న విడుదల కానుంది. అప్పట్లో ఈ సినిమాపై బజ్ బాగానే ఉండేది. అప్పుడు విడుదల చేసిన ట్రైలర్ కూడా జనాలను ఆకట్టుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా సంవత్సరానికి పైగా వాయిదా పడింది. మొదట్లో ఈ చిత్రానికి ముద్ర అన్న టైటిల్ పెట్టగా, దాన్ని ఎవరో కాజేసి సినిమాను కూడా విడుదల చేసేసుకున్నారు. దీంతో టైటిల్ మార్చక తప్పని పరిస్థితి. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ గా నటించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన అతనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కానీ నిఖిల్ ఇంకా కొత్త సినిమాను మొదలుపెట్టలేదు.

నిజానికి నిఖిల్ అర్జున్ సురవరం తర్వాత కార్తికేయ 2 చిత్రాన్ని మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో కార్తికేయ కూడా ఒకటి. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కార్తికేయ 2 వంతు వచ్చింది. నిఖిల్ కు కెరీర్ పరంగా గ్యాప్ వచ్చినా కార్తికేయ 2 ని పట్టాలెక్కించలేదు. దీనికి బడ్జెట్ ఇబ్బందులు తలెత్తాయి. మొదటి భాగాన్ని తెరకెక్కించిన చందూ మొండేటి రెండో భాగానికి కూడా దర్శకత్వం చేస్తాడు. అయితే మొదట ఈ చిత్రానికి 20 కోట్ల బడ్జెట్ ప్లాన్ వేసాడు చందూ మొండేటి. 20 కోట్లు చూసి మొదట నిర్మిద్దామనుకున్న ఆసియన్ సినిమాస్ వారు వెనక్కి తగ్గారు. నిఖిల్ రేంజ్ కు ఆ బడ్జెట్ చాలా ఎక్కువని వారు ఫీల్ అయ్యారు. దాంతో కార్తికేయ 2 కు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

రీసెంట్ గా మళ్ళీ కార్తికేయ 2 పట్టాలెక్కనుందని సమాచారం. 20 కోట్లు అంటే నిర్మాతలు బెదిరిపోతున్నారు కాబట్టి చందూ మొండేటి ఈ చిత్రాన్ని 15 కోట్లలో నిర్మించి ఇస్తానని మాట ఇచ్చాడు. ఈ ఆఫర్ కు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ముందుకు వచ్చారు. 15 కోట్లలో చేస్తామంటే సినిమా నిర్మించడానికి తాము సిద్ధమని ప్రకటించారు. దీంతో మళ్ళీ కార్తికేయ 2 పనులు ముందుకు కదిలాయి. ఇక్కడిదాకా బానే ఉంది కానీ చందూ మొండేటి నిజంగా 15 కోట్లలో సినిమాను నిర్మించగలడా? సవ్యసాచి లాంటి సాధారణ సినిమాకే 30 కోట్లు మైత్రి వాళ్ళ చేత పెట్టించాడు. ఇక కార్తికేయ 2 సిజి వర్క్స్ ఎక్కువగా ఉన్న చిత్రం. పైగా కథ ప్రకారం ఇండియాలోని వివిధ చోట్ల షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ప్రతికూలతల మధ్య చందూ కార్తికేయను మించిన సినిమా అందించగలడా??.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Xdjrc5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...