పిల్లలకు ఎవరికైనా తరచూ మంచినీళ్లు త్రాగమని చెబితే మన ముందు ఆ మాట వింటారు కానీ అది వారికి అంతగా గుర్తు ఉండదు. ఆటలలో పడి లేదా సమయం లేక, అనేక కారణాల వల్ల వారు ప్రతిరోజు నిర్ణీత మొత్తంలో ఎంత మంచి నీళ్లు తాగాలో అంతా తాగడం లేదు . ఇలా జరగడం వలన, డీ హైడ్రేషన్, లాంటి అనారోగ్యాలకు కారణం అవుతుంది.
బడికి వెళ్లి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు కావలసింత మంచినీరు త్రాగడం ద్వారా, ఆరోగ్య పరిస్థితులు మెరుగు పరిచే మంచి ఉద్దేశంతో మన కేరళ రాష్ట్రంలో “వాటర్ బెల్” అనే కాన్సెప్ట్ ఉంది. అది ఏమిటంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి మూడు తరగతులకు ఒకసారి విద్యార్థినీ విద్యార్థులు మంచి నీరు తాగేందుకు 10 నిమిషాలపాటు విరామం ఇవ్వడం.
ఈ వినూత్న కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను మరియు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఉమ్మార్ అరబిక్ పాఠశాల లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ తో పాటు కలిపి ఎమ్మెల్యే ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంబంధిత నీటి సీసాలు మరియు రాసుకునే పుస్తకాలను ఉచితంగా అందజేస్తారు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు అందరూ సమతులంగా మంచి నీరు త్రాగే విధంగా ప్రతిపాదించబడిన ఈ “వాటర్ బెల్” అనే అంశం మీద మరింత మెరుగైన అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/35ffExJ
Comments
Post a Comment