Skip to main content

“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు

“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు
“ఫ్లిప్ కార్ట్” పైనే ఎక్కువ ఫిర్యాదులు

ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు బాగోకపోయినా, లేక ఇతర నచ్చకపోయినా కొన్న దగ్గరకి వెళ్లి మార్చుకుంటూ ఉంటాం. కొంతమంది మనకి నచ్చినవి మళ్ళీ మార్చి ఇస్తారు. కొంతమంది ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళ దగ్గరకి మళ్ళీ వెళ్తాం. ఇవ్వని వాళ్ళని బండ బూతులు తిట్టుకుంటూ ఉంటాం. ఇంతకీ విషయం ఏంటంటే, జనాలు పూర్తిగా ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ కి అలవాటు పడిపోయారు. ఏదైనా ఒక వస్తువుని ఎవరో డబ్బులు తీసుకొని ఇచ్చిన రేటింగులు మీద స్టార్ల మీద ఆధారపడి జనాలు అవసరం ఉన్నా లేకపోయినా, అరచేతిలో ఫోన్ ఉంది కదా! అని ఆన్ లైన్ లో కొనేస్తున్నారు. “సందట్లో సడేమియా” లాగా కొంతమంది నకిలీ బ్యాచ్ ఆన్ లైన్ లో ఫోన్ కోసం బుక్ చేస్తే రాళ్లు పంపించడం, చొక్కా & ప్యాంటు బుక్ చేస్తే చిరిగిపోయిన దుప్పట్లు పంపించడం.. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు కూడా వింటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రంగం ఎంతో విస్తృతంగా మారిపోయింది. వీళ్ల దగ్గర స్టాక్ మిగిలిపోయిన ప్పుడల్లా ఇయర్ ఎండ్ సేల్ అని, ఇండిపెండెన్స్ డే అని ఇష్టమొచ్చినట్లు ఆఫర్లు పెడుతున్నారు. వినియోగదారులు కూడా ప్రస్తుతం చేసే ఫిర్యాదులో అధికశాతం ఈ కామర్స్ సమస్యలపైనే ఉన్నాయట.

అందులోనూ భారతదేశ ఈ కామర్స్ రంగంలో గట్టిపోటీ ఇస్తున్న దిగ్గజ సంస్థ “ఫ్లిప్ కార్ట్” పై ఈ కంప్లైంట్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రిలయన్స్ జియో, అమెజాన్ మరియు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకు ఫిర్యాదులు పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా ఫిర్యాదులు రాగా, వాటిలో లక్షకు పైగా ఫిర్యాదులు ఈ కామర్స్ సంస్థలకు సంబంధించినవే. బ్యాంకులపై 41, 600 టెలికాం సంస్థలపై 29,400 ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో కూడా 5,60,300 ఫిర్యాదులలో, లక్ష వరకు ఈ కామర్స్ పైనే ఉన్నాయి. ఈ ఫిర్యాదులో ఎక్కువగా అడిగిన వస్తువులు పంపించలేదని, పాడై పోయిన వస్తువులు పంపించారని, ఎక్చేంజ్ చేసుకోవడం లేదని, ఆర్డర్ చేసినప్పుడు ఆలస్యంగా పంపిస్తున్న ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33X4eOx

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...