Skip to main content

ఎన్టీఆర్ సొంత కుంపటికి కారణమేంటి?

reason behind ntr floating production house
reason behind ntr floating production house

నిన్న ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా హల్చల్ చేసిన న్యూస్.. ఎన్టీఆర్ సొంత కుంపటి.. అదే ఎన్టీఆర్ మిగతా హీరోల తరహాలో సొంత ప్రొడక్షన్ హౌజ్ పెట్టాలని నిర్ణయించుకోవడం. నిజానికి తెలుగు హీరోలు చాలా మందికి ఇప్పుడు ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నాయి. తమ కుటుంబంలో ఆల్రెడీ నిర్మాణ సంస్థలున్నా కూడా సొంత కుంపటి పెట్టుకోవడానికే ఈ హీరోలు మొగ్గు చూపడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇంట్లో రెండు ప్రొడక్షన్ హౌజ్ లు ఉన్నాయి. అయినా కానీ జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పేరిట సొంత బ్యానర్ ను స్థాపించి వరసగా తన సినిమాల్లో భాగస్వామిగా ఉంటున్నాడు. తొలిసారి ఇప్పుడు బయట హీరోతో కూడా సినిమా చేయబోతున్నాడు. అడివి శేష్ హీరోగా తెరకెక్కనున్న మేజర్ సినిమాను మహేష్ బాబే స్వయంగా నిర్మించనుండడం విశేషం.

మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే, ఇక్కడ కూడా అంతే. అల్లు అరవింద్ వంటి ప్రముఖ నిర్మాత ఉన్నాడు. నాగబాబుకు కూడా సినిమాలు నిర్మించిన చరిత్ర ఉంది. కానీ రామ్ చరణ్, తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీకి కొణిదెల ప్రొడక్షన్స్ అని సొంత బ్యానర్ ను స్థాపించి దానిమీదే సినిమా తీసాడు. సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించడానికి చాలా మంది ముందుకొచ్చినా రిస్క్ ఎక్కువ కాబట్టే నేనే తీసుకుంటా అని చెప్పి కొణిదెల బ్యానర్ మీదే దాన్ని కూడా నిర్మించాడు. ఇప్పుడు కొరటాల శివ చేయబోయే చిరంజీవి చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగం తీసుకుంటోంది.

మంచు ఫ్యామిలీలో ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క బ్యానర్ ఉంది. మోహన్ బాబు ఎప్పటినుండో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నాడు. మంచు విష్ణుకు 24 ఫ్రేమ్స్ అనే బ్యానర్ ఉంది. మంచు లక్ష్మికి లక్ష్మి టెలీఫిల్మ్స్ పేరిట సొంత బ్యానర్ ఉంది. ఇవి చాలవన్నట్లు మంచు మనోజ్, MM ఆర్ట్స్ పేరిట ఒక బ్యానర్ ను స్థాపించాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ కూడా వీరి బాటలోనే సొంత బ్యానర్ ను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుటుంబంలో కళ్యాణ్ రామ్, బాలకృష్ణ ఇద్దరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ జై లవకుశ చిత్రాన్ని చేసాడు కూడా. అయినా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలని నిర్ణయించుకున్నాడు యంగ్ టైగర్. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ బ్యానర్ కు సంబంధించిన విశేషాలు తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది.

హీరోలందరూ ఇలా బ్యానర్ లు స్థాపించడానికి ప్రధాన కారణం పారితోషికం అని అంటున్నారు. మొదట 15 కోట్లు, 20 కోట్లు అంటే నిర్మాతలు బేరాలాడుతున్నారు కాబట్టి పారితోషికం రూపంలో తీసుకోకుండా ఇలా ఒక బ్యానర్ ను స్థాపించి నిర్మాణ భాగస్వామిగా ఉంటే దీనికి రెట్టింపుకు మించి పారితోషికం ముడుతోంది. మహేష్ బాబు ఇలాగే తన ప్రతీ సినిమాకి 40 కోట్లు దాకా ముడుతోంది. కేవలం రెమ్యునరేషన్ పెంచుకోవడానికే ఎన్టీఆర్ బ్యానర్ స్థాపిస్తున్నాడా అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NAPHlU

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...