Skip to main content

అన్నవరం టార్గెట్ గన్నవరం..??

Pawan Kalyan target gannavaram ?
Pawan Kalyan

అవును మీరు కరెక్టు గానే విన్నారు… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో జరిగే గన్నవరం నియోజకవర్గం ఉప ఎన్నికలలో పోటీ చేస్తారని, అందుకే ఎన్నికల తరువాత ఇంత కాలం మౌనం గా ఉన్న పవన్ ఒక్కసారిగా నిన్న జరిగిన విశాఖ సభతో మళ్ళీ పొలిటికల్ లైమ్ లైట్ లోకి వచ్చారని కొంత మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటే, ఈ విషయం నిజం అయితే బాగుండని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

గన్నవరం నియోజకవర్గం మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కి కంచు కోట అని మళ్ళీ ఎన్నికలలో ఏ అభ్యర్ధిని పసుపు జెండా ఇచ్చి నిలబెట్టినా, గెలుస్తామన్న ధీమా లో ఉన్న టీడీపీ కి ప్రస్తుతం ఆ నమ్మకం నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నట్లు అనిపిస్తోంది. దానికి తగ్గట్లే అధినేత చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు మరి గన్నవరం ఉప ఎన్నికలు జరిగితే ఆ సీటు కోల్పోకుండా, ఉండాలి అంటే, జనసేన పార్టీని బలపరిచి పవన్ కళ్యాణ్ ని గన్నవరం అభ్యర్ధిగా బలపరచడమే ఏకైక మార్గం. జనసేన పార్టీ విషయానికి వస్తే ఎలాగు తెలుగుదేశం పార్టీ తో లోపయీకారీ ఒప్పందం ఉందనే ముద్ర పడింది కాబట్టి, పార్టీ ని 2024 దాకా  క్యాడర్ తో పాటు కాపాడుకోవాలి అంటే ఉన్న మార్గం గన్నవరం ఎన్నికలలో గెలవడమే.

ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ నేరుగా, ఎన్నికలు తరువాత active అయ్యారంటే ఆయన కూడా గన్నవరం ఉప ఎన్నికలను సీరియస్ గా  తీసుకున్నట్లే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ విజయవాడ లో స్థిర నివాసం  ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇది జరిగే సూచనలు ఉన్నాయని అనుకోవచ్చు.

ఒక్కసారి గన్నవరం లో గత ఎన్నికల పోలింగ్ ని పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వల్లభనేని వంశీ కి 1,0,3881 ఓట్లు రాగా, ysrcp కి చెందిన అభ్యర్ధి యార్లగడ్డ వెంకట రావు కి 103043 ఓట్లు వచ్చాయి అంటే మెజారిటీ కేవలం 800 ఓట్లు మాత్రమే. పొత్తులో భాగంగా జనసేన తరపున పోటీకి దిగిన CPI అభ్యర్ధి afsar syed కి 6675 ఓట్లు వచ్చాయి.

మరోవైపు తెలుగుదేశం పార్టీ గన్నవరం ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో వల్లభనేని వంశీ కి దీటైన అభ్యర్ధి ని నిలబెట్టాలని  ఇప్పటిదాకా 10 మందికి పైగా స్క్రూటినీ చేసి అధినేత చంద్రబాబు దగ్గరికి తీసుకుని వెళ్ళినా ఆయన వాళ్ళను ఎవరిని ok చెయ్యలేదని విశ్వసనీయ వర్గ సమాచారం.

ఆదివారం జరిగిన లాంగ్ మార్చ్ లో కూడా, తెలుగుదేశం పార్టీ ఏదో నామమాత్రపు సంఘీభావం తెలపడం కాకుండా, పూర్తి స్థాయిలో తాము గెలిచినా విశాఖలో పవన్ కళ్యాణ్ కి అన్ని రకాలుగా సహయం చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.

మరి 2014 ఎన్నికల తరువాత అధికార పార్టీకి ఎదురు తిరిగి రాజకీయంగా active కావడానికి 4 ఏళ్ళు టైం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2019 లో నాలుగు నెలలకే ప్రశ్నించడం మొదలు పెట్టారు అంటే, ఇది త్వరలో జరగబోయే ఉప ఎన్నికల యుద్దానికి trail అని అందరూ అనుకుంటున్నారు .



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WK7TN5

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...