Skip to main content

నితిన్ వరసగా భలే ప్రాజెక్టులను సెట్ చేస్తున్నాడుగా

Nithiin sets up five projects
Nithiin sets up five projects

యంగ్ హీరో నితిన్ దశాబ్దం తర్వాత హిట్లు అందుకుంటే ఇక అతనికి తిరుగులేదు అనుకున్నారు. అయితే రీసెంట్ గా నితిన్ చేసిన మూడు సినిమాలు లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం ప్లాప్ అవ్వడం తన కెరీర్ కు భారీ దెబ్బ. నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాలని ఎప్పటినుండో అనుకుంటున్న నితిన్ ను ఈ హ్యాట్రిక్ ప్లాపులు బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే శ్రీనివాస కళ్యాణం తర్వాత నితిన్ మరే చిత్రాన్ని వెంటనే అంగీకరించలేదు. కొన్ని నెలలు విరామం తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో బోలెడన్ని కథలు విన్నాడు. అయితే ఫైనల్ గా నితిన్ ఛలో చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రాన్ని అంగీకరించాడు. అంతటితో ఆగిపోలేదు. వరసగా మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. భీష్మ తర్వాత తొలిప్రేమ, mr మజ్ను చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేయడానికి తన అంగీకారం తెలిపాడు నితిన్. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఒకవైపు భీష్మ చేస్తూనే రంగ్ దే కు సంబంధించిన తొలి షెడ్యూల్ ను పూర్తి చేసాడు.

ఈ రెండు సినిమాలు కాకుండా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటి దర్సకత్వంలో సినిమా చేయడానికి సైన్ చేసాడు. రంగ్ దే పూర్తవుతుండగానే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడు. ఇవన్నీ కాకుండా తన స్నేహితుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా అంగీకారం తెలిపాడు. కాకపోతే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం పడుతుంది. 2020 చివర్లో కృష్ణ చైతన్య సినిమా పట్టాలెక్కవచ్చు.

ఇక లేటెస్ట్ గా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, బాలీవుడ్ లో సూపర్ హిట్టై నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న అందాధూన్ సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. నితిన్ ఆయుష్మాన్ ఖురానా పాత్రను పోషించనున్నాడు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, లాంటి విషయాలు ఏవీ ఇంకా తెలియలేదు. ఈ సినిమా ఎప్పుడు మొదలుపెడతారో కూడా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది మొదలవ్వడం అయితే పక్కా. ఆయుష్మాన్ ఖురానాకి ఈ చిత్రంతో నేషనల్ అవార్డు కూడా రావడంతో నితిన్ ఆ పాత్రలో ఎలా చేస్తాడోనన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక భీష్మ విషయానికి వస్తే నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రష్మిక,, నితిన్ కు బాస్ గా నటిస్తోన్న ఈ సినిమా మంచి ఫన్ ను జెనెరేట్ చేస్తుందని అంటున్నారు. వెంకీ కుడుముల మొదటి సినిమా ఛలో కూడా హిలేరియస్ గా సాగుతుంది. భీష్మలో కూడా అలాంటి ఎపిసోడ్స్ ను పెట్టినట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినా ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ భీష్మాను నిర్మిస్తోంది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Kj86BZ

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...