Skip to main content

ఇంగ్లిష్ మీడియం పై  బీజేపీ భిన్న స్వరాలు

AP-BJP-Leaders-Dual-Voice
AP-BJP-Leaders-Dual-Voice

“రాయడానికి ఏమీ లేనప్పుడు, గోడకి ఇంకొకసారి సున్నం రాయండి” అని ఒక ముతక సామెత ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా ఈ సామెత ఎందుకు గుర్తు వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గత కొద్ది రోజులుగా, ఇంగ్లీష్ మీడియం చదువుల చుట్టూ తిరుగుతోంది.  ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నా, ఒక్క కఠోర సత్యం మాత్రం అందరూ గుర్తించాలి. ఇంతకుముందు ప్రభుత్వస్కూల్స్ లో తెలుగు మీడియం ఉన్నా, భవిష్యత్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినా, గవర్నమెంట్ టీచర్లు తీసుకునే జీతానికి తగ్గట్లు, ఒళ్ళు ఒంచి పని చెయ్యనంతవరకు ఈ విద్యా వ్యవస్థ మారదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే విద్య సంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్ళ నందు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నిర్ణయంపై కొంత మంది నిపుణులు హర్షం వ్యక్తం చెయ్యగా, మరికొంత మంది మాత్రం తెలుగు బాష కు అన్యాయం జరుగుతోంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జరిగే ప్రతీ విషయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూసే ప్రస్తుత నాయకులు కనీసం స్పందించే అంశంలో ఒక గూటి కింద ఉన్న వాళ్ళం, ఒక మాట మీద ఉండాలన్న ముందు జాగ్రత్త, ప్రణాళిక, పరస్పర అవగాహన ఏ మాత్రం ఉండటం లేదు. మళ్ళీ వీళ్ళు జాతీయ పార్టీ కి చెందిన పెద్ద మనుషులు, వీళ్ళ సేవలు ఉపయోగించుకుని, సదరు పార్టీ ఇక్కడ నిలబడాలని చూడటం. నిజంగా ప్రజల దౌర్భాగ్యం అనే చెప్పాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆంగ్ల మాధ్యమం మీద వ్యతిరేకంగా మాట్లాడారు, AP బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. గతంలో బీజేపీ లోకి రాక ముందు అసలు హిందూ ధర్మం పై అరకోరగా మాట్లాడే ఆయన ఏకంగా ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం వెనుక మాట ప్రచర కుట్ర ఉన్నట్లు మాట్లాడారు.

అయితే మరొక బీజేపీ అగ్ర నాయకుడు సోము వీర్రాజు గారు మాత్రం ఈ అంశంలో ముఖ్యమంత్రి జగన్ కు సానుకూలంగా మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ మీడియం లో పిల్లలు చదివితే మంచిది అని, ప్రైవేట్ విద్యా సంస్థల వల్ల ఇప్పటికే 48 శాతం తెలుగు కనుమరుగైపోయింది అని, తెలుగు బాషకు సమాన ప్రాధాన్యత ఉండేలా చూడాలని సూచించారు.

వీళ్ళ ఇద్దరి వాదనలు ఎలా ఉన్నా, ఒకే పార్టీ కి చెందిన ఇద్దరు అగ్ర నాయకులు ఒక అంశం కు సంబంధించి ఇలా తలొక మాట మాట్లాడటం పార్టీ పరిస్తి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఈ వ్యవహారంలో పూల పార్టీ నాయకులను జనాలు అన్ ప్రొఫెషనల్ లీడర్స్ అని తిట్టుకుంటున్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32Lr1fa

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...