Skip to main content

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరనున్న దేవినేని అవినాష్

Devineni Avinash jumps to YSRCP
Devineni Avinash jumps to YSRCP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిన్న మొన్నటి వరకు ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, పార్టీ పెట్టినప్పటి నుంచి, ఎప్పుడు ఎదురు కాని ఘోరపరాజయం ఎదురుకావడంతో, నిన్న మొన్నటి వరకు పసుపు జెండా పట్టుకొని, పసుపు చొక్కా వేసుకొని, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పసుపు మయం చేయాలని కంకణం కట్టుకొని తిరిగిన తమ్ముళ్లు ఇప్పుడు ఆత్మరక్షణలో అంతర్మథనంలో పడిపోయారు.

దానికి తోడు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, వల్లభనేని వంశీ మోహన్, లాంటి నాయకులు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇప్పుడు పసుపు పార్టీకి మరో షాక్ తగిలింది. విజయవాడ రాజకీయాలలో మాత్రమే కాదు, రాష్ట్ర రాజకీయాలలో చెప్పుకోదగిన గుర్తింపు తెచ్చుకున్న దివంగత నాయకుడు దేవినేని రాజశేఖర్ నెహ్రూ తనయుడు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

దేవినేని అవినాష్ బుధవారం తన నివాసంలో తన అనుచరులు స్థానిక నాయకులు మరియు అభిమానులతో పెద్ద ఎత్తున విస్తృతస్థాయి సమావేశం అయ్యారు. మరొక రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత, మాజీ కార్పొరేటర్ కడియాల బుచ్చిబాబు ధృవీకరిస్తున్నారు.

దేవినేని అవినాష్ తండ్రి దివంగత దేవినేని రాజశేఖర్ నెహ్రూకు విజయవాడ రాజకీయాల పై మంచి పట్టు ఉండడంతో పాటు, పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతు కూడా ఉంది. ఇప్పుడు దేవినేని అవినాష్ కు అదే బలం. గతంలో కూడా స్వర్గీయ ఎన్టీఆర్ పదవీచ్యుతుడు అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు తో విభేదించి, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న దేవినేని రాజశేఖర్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇటీవలే మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలో కి మళ్ళీ వచ్చారు. తన బిడ్డ అవినాష్ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసమే, తాను మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు కొద్ది రోజుల క్రితమే ఆయన స్వర్గస్తులయ్యారు.
గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు పరంగా, తనకు జరిగిన తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల దృష్ట్యా, అవినాష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ సాధించడమే లక్ష్యంగా, దేవినేని అవినాష్ గారి రాజకీయ కార్యాచరణ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33Po8LE

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...