Skip to main content

మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు

మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు
మహేష్ ఎందుకని ఆ ప్యాంట్ ను వదలట్లేదు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ మేజర్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే సినిమా ఓపెనింగ్ కాసేపు ఆర్మీ వ్యవహారాల్లో కనిపించే మహేష్ తర్వాత రెగ్యులర్ పంథాలోకి వచ్చేస్తాడు. కామెడీ, ఫ్యామిలీ ఎపిసోడ్స్, ఫ్యాక్షన్ ఇలా సాగుతుంది వ్యవహారం. అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ ఆర్మీ పాత్రలో నటించినా సినిమా మొత్తం వేరే డ్రామా ఉంటుంది. కాసేపే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో నటించాడు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరులో కూడా ఇలాంటి వ్యవహారమే కనిపిస్తోంది. ఇదంతా బానే ఉంది కానీ మహేష్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లలో ఆర్మీ ప్యాంట్ తోనే కనిపించాడు. అసలు సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఇప్పటివరకూ జరిగిన ప్రమోషన్స్ చాలా తక్కువ. సందర్భానికి తగినట్లు ఏవో కొన్ని పోస్టర్లు అయితే విడుదల చేసారు. ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్ అన్నిట్లోనూ మహేష్ బాబు కామాఫ్లాజ్‌ ప్రింట్‌ ఉన్న ప్యాంట్ నే ధరిస్తూ వస్తున్నాడు.

కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర మహేష్ కత్తి పట్టుకున్న పోస్టర్ విడుదల చేసినా, అనిల్ రావిపూడితో కలిసి కూర్చొన్న స్టిల్ వదిలినా, కేరళ షెడ్యూల్ పూర్తైనప్పుడు టీమ్ మొత్తం కలిసి ఫోటో దిగినా అన్నిట్లోనూ మహేష్ ఈ ఆర్మీ ప్యాంట్ తోనే ఉన్నాడు. ఎంత ఆర్మీ పాత్ర అయితే మాత్రం ఇలా ప్రతిసారి దాన్ని గుర్తుచేసేలా సందర్భంతో పనిలేకుండా ఆర్మీ ప్యాంట్ తో మహేష్ అల్లాడించేస్తున్నాడు అంటూ బహిరంగంగానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

దీనికి అనిల్ రావిపూడి వెర్షన్ వేరే ఉంది. సినిమాలో కాసేపే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ తో కనిపిస్తాడు మహేష్. కానీ ఆర్మీ మేజర్ అన్నది సినిమాలో పలు సందర్భాల్లో ఎఫెక్ట్ ఉంటుంది. అది వచ్చినప్పుడు సడెన్ గా ఆడియన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు ఇలా మహేష్ చేత ఆర్మీ ప్యాంట్ ను కన్సిస్టెంట్ గా సినిమా మొత్తం వేయించాడట. ఇదెక్కడి లాజికో అర్ధం కావడం లేదు కానీ ఇలాంటి చిన్న విషయాలను పక్కనపెడితే సరిలేరు నీకెవ్వరు చాలా బాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఇందులోని కామెడీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తారని, కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తారని, ఇక ట్రైన్ ఎపిసోడ్ అయితే వెంకీ తరహాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదిగా ఉంటుందిట. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ కామెడీ ఇందులో చూడొచ్చు అని అంటున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ చక్కగా కుదిరినట్లు తెలుస్తోంది. మహేష్ నుండి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ కు సంక్రాంతికి విందు భోజనం లాంటి సినిమా అని చెబుతున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O0kxUa

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...