Skip to main content

మహారాష్ట్ర లో మొదలైన రిసార్టు రాజకీయం

మహారాష్ట్ర లో మొదలైన రిసార్టు రాజకీయం
మహారాష్ట్ర లో మొదలైన రిసార్టు రాజకీయం

ముత్యాలముగ్గు సినిమాలో మా రావు గోపాల్ రావు గారు అన్నట్లు “ఆట్టే, తిని తొంగుంటే మనషికి గొడ్డుకి తేడా ఏం ఉంటది.? మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలా” అని చెప్పాడు మహానుభావుడు.ఈ మాట ఎవరు పాటించినా, పాటించకపోయినా మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. నాకు చిన్నతనం లో ఇప్పుడు ఒక సందేహం ఉండేది. ఊళ్లో కాకుండా, ఊరికి బయట, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఎందుకు పెద్ద పెద్ద ఫాంహౌస్ లు, రిసార్ట్ లు కడతారు.? అని. మన రాజకీయ నాయకుల పుణ్యమాని, ఓటు హక్కు వచ్చి, ఈ దేశపు రాజకీయ ప్రజాస్వామ్యం అనే ఒక వికృత క్రీడ లో, ఓటర్ అనే ఒక నామమాత్రపు పాత్రధారి వేషము ధరించిన తర్వాత పిచ్చ క్లారిటీ వచ్చేసింది.

అసలు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటి.. అంటే, మన మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత – రాజకీయ సంక్షోభం కొనసాగుతుండటంతో, గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీ వలలో పడకుండా, ప్రతి రాజకీయ పార్టీ తమ వంతు జాగ్రత్తగా జోల పాట చర్యలు మొదలు పెట్టింది. ఇలాంటి వాటిలో ఆరితేరిన, కాంగ్రెస్ పార్టీ అయితే, తన ఎమ్మెల్యేలను రాష్ట్రమే దాటించి, రాజస్థాన్ లో ఉన్న జైపూర్ లో ఉన్న బుయేనా విస్టా రిసార్ట్స్ కి తరలించింది. ఈ రిసార్ట్ లో ఉన్న 50 విల్లాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేస్తూ ఉండగా, ఒక్కొక్క జిల్లా రోజువారి సాధారణ ఖర్చు 1.20 లక్షలు అవుతున్నట్టు సమాచారం. అందులోనూ ప్రతి విల్లాకు ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ వంటి హంగులు ఉన్నాయి. ఇక ఎవరు పడితే వారు, సదరు M.L.A ల దగ్గరికి వెళ్లకుండా, ఏ విషయం పడితే ఆ విషయం వాళ్ళ చెవుల్లో పడకుండా, అసలు వాళ్ళు బయట ప్రపంచం గురించి ఆలోచించకుండా.. వాళ్ల బలహీనతల ఆధారంగా చేసుకొని అన్ని రకాల వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారట. అడిగిందే తడవుగా వారు కోరిన ఆహారంతో పాటు, వారు సేవించే పానీయాలు, ఇక అన్ని రకాలుగా వారిని తృప్తి పరిచే కార్యక్రమాలకు సదరు నిర్వాహకులు దగ్గర ఏర్పాటు, ద్వాటికి తగ్గ సిబ్బంది ఉన్నారట.

ఏది ఏమైనా,… మరొకసారి మహారాష్ట్రలో మరణించిన ప్రజాస్వామ్యానికి మా నిస్సహాయ నివాళి



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2O4Chh9

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...