Skip to main content

ట్రోల్స్ కు భయపడి స్వరం మార్చిన స్వర

swara bhaskar controversy on children took ugly turn
swara bhaskar controversy on children took ugly turn

బాలీవుడ్ లో స్వర భాస్కర్ అనే ఒక నటి ఉంటుంది. ఆమె పేరు సినిమాల్లోని తన నటన ద్వారా ఎంత వినిపించిందో తెలీదు కానీ అక్కర్లేని కాంట్రవర్షియల్ విషయాలతో ఎక్కువ పాపులర్ అయింది. సంబంధం ఉన్నా లేకున్నా సమాజంలో జరుగుతున్న విషయాల గురించి స్పందించడం, బోల్డ్ అన్న పేరుతో ఇష్టమొచ్చినట్లు వాగడం, ఏమైనా అంటే మహిళా అంటూ స్వరం పెంచడం ఈవిడగారికి బాగా అలవాటైపోయాయి. ఈ మధ్య ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

స్వర భాస్కర్ ఇటీవలే ఒక కామెడీ షో కు వెళ్లిందట. ఆ షో లో ఆమె మాట్లాడుతూ పిల్లల్ని దయ్యలతో పోల్చింది. ఇప్పుడదే వివాదానికి కారణమైంది. అంతటితో ఆగిపోయినా బాగుండేది కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ఆమె తొలినాళ్ళలో యాడ్ షూట్ జరుగుతుండగా ఒక పిల్లడు తనను ఆంటీ అనడాన్ని తెలియజేస్తూ ఆ పిల్లాడ్ని అసభ్యపదజాలంతో దూషించింది. ఈ కామెడీ షో ప్రసారమయ్యాక ఆమె మీద ట్రోల్స్ ఒక రేంజ్ లో రావడం మొదలయ్యాయి. పిల్లల్ని అలా నోటికొచ్చినట్లు ఎలా తిడతావ్ అంటూ నెటిజన్లు ఆమెను దూషించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా గతంలో ఆమె మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యలను తవ్వడం మొదలుపెట్టారు.

ఏదో పబ్లిసిటీ కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన స్వర భాస్కర్ జరిగిన నష్టాన్ని త్వరగానే గుర్తించింది. ఆమె వ్యాఖ్యలపై జరుగుతున్న రభసకు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. తన ఉద్దేశం అది కాదని, పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, పిల్లల్ని దయ్యలతో పోల్చడం చాలా సరదాగా జరిగిందని ఆమె కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. నేను మాట్లాడిన కామెడీ షో ఎలాంటిదో తెలిస్తే తన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకునే వారు కాదు అంటూ తప్పునంతా ఆ షో పై నెట్టే ప్రయత్నం చేసింది. నేను ఆ పిల్లాడిపై చేసిన వ్యాఖ్యలు కూడా సరదాగా అన్నవే. ముంబైలో తన తొలిరోజు షూటింగ్ అనుభవాలను అలా సరదాగా పంచుకోవాలనుకున్నా. పిల్లల కోసం ఏదైనా చేయాలనుకునే వారిలో నేను కూడా ఒకరిని అని స్వర భాస్కర్ వెల్లడించింది. అయితే ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా నెటిజన్లు శాంతించకపోవడం గమనార్హం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qjx0oA

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...