Skip to main content

రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు

రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు
రిలీజ్ అయిన పాటను చూసి బూతులు తిడుతున్న జనాలు

ఒక చిన్న సామెత చెప్పి తర్వాత అసలు మేటర్ లోకి వెళ్దాం.
“దగ్గడం చేతకానప్పుడు “దగ్గు” రాదని చెప్పాలి కానీ.. నేను “దగ్గుబాటి రానా“ అంత తోపు అని చెప్పకూడదు.”
ఏ పనైనా దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక సినిమా తీసినప్పుడు దానికి తగినట్టుగా ఉండే పాటలు సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న సినిమాలు చేసే వారికి దర్శకుడు, నిర్ణయంతో సంబంధం లేకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ల విజ్ఞాన ప్రదర్శనలపై ఆధారపడి నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడెప్పుడో “దళం” అనే ఒక మంచి సినిమా తీసిన దర్శకుడు జీవన్ రెడ్డి, ఇప్పుడు అభినవ ఉస్మానియా చేగువేరా ఆయన “జార్జి రెడ్డి” బయోపిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. తనతోపాటు సినిమా ప్రయాణంలో ఎప్పుడూ తోడుగా ఉన్న తన రూమ్మేట్ ను, అదే వంగవీటి సినిమాలో హీరోగా చేసిన శాండీ హీరోగా ఈ సినిమాలో పెట్టుకున్నాడు.

కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన జార్జిరెడ్డి ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. డైలాగ్స్ పరంగా హీరో శాండీ ఇంకొంచెం మెరుగుపరచుకోవాలి ఉన్నట్లు చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో సత్యదేవ్, వంశీ చాగంటి, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, కమెడియన్ ప్రవీణ్ నూకరాజు వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. హీరోయిన్ గా ముస్కాన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి “బుల్లెట్ సాంగ్” అనే ఒక పాటను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో పాటల ద్వారా కోట్లు సంపాదిస్తున్న రచయిత & సంగీత దర్శకుడు & గాయకుడు అయిన “మిట్టపల్లి సురేందర్” ఈ పాటను స్వరపరచగా ప్రతి పండగ కి ఒక మంచి కొత్త పాట తో మన ముందుకు వచ్చే గాయని “మంగ్లీ” ఈ పాటను ఆలపించారు.

అయితే ఈ పాట సినిమా స్థాయికి తగ్గట్టుగా లేదని సాహిత్యము సంగీతము పరంగా చూసుకుంటే ఒక చిన్న ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లా ఉందని సిని అభిమానులు ముఖ్యంగా జార్జిరెడ్డి అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరి సినిమాలో అయినా పూర్తిగా సిద్ధమైన పాట ఉంటుందా .? లేక పోతే ఇలాంటి పాటలే ఉంటాయా..? అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. ఏదిఏమైనా, ట్రైలర్ తో మాంచి కిక్ ఇచ్చిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ పాటతో సినిమా మీద ఉన్న హైప్ ను తానే తగ్గించినట్లు అయింది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NsSBZV

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...