Skip to main content

అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?

అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?
అశుతోష్ గోవారికర్ చరిత్రను మళ్ళీ చెడగొడతాడా ..?

చరిత్రలో నిలిచిపోయిన మహాయుద్ధం పానిపట్. 1761 జనవరి 14 వ తేదీన యావత్ భారతదేశ చరిత్రలో మరిచిపోలేని ఒక మహా సంగ్రామం జరిగింది. భారతదేశ ఆత్మగౌరవానికి దోపిడీదారుల అత్యాశకు మధ్య జరిగినది మూడవ పానిపట్టు యుద్ధం. భారతదేశం పై దురాక్రమణ చేస్తున్న అహ్మద్ షా దుర్రానీ కి, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరాఠా సామ్రాజ్య యోధులకు మధ్య జరిగిన ఆ యుద్ధంలో జయాపజయాలకు అతీతంగా మన మట్టిపై పుట్టి, మన దేశం పరాయి వాళ్ళ చేతుల్లోకి పోకుండా వీరోచితంగా పోరాడి, అమరవీరుల అయినటువంటి అమరవీరులకు స్వార్ధం తో నిండిపోయిన ప్రస్తుత చరిత్ర సముచిత స్థానం ఇవ్వలేదు. కారణాలు ఎలా ఉన్నా ప్రస్తుతం ఆ కథాంశాన్ని ఒక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అశుతోష్ గోవారికర్. ఇంతకుముందు జోధా అక్బర్ అనే సినిమా తీసి సాంకేతికంగా ఉన్నతంగా ఉంది అని అనిపించినా, చరిత్రను వక్రీకరించాడన్న చెడ్డ పేరు సంపాదించిన గోవారికర్ మళ్లీ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేయబోతున్నట్లు అనిపిస్తోంది.

ఈ సినిమాలో మరాఠా యోధుడు సదాశివరావు పాత్రలో అర్జున్ కపూర్, గోపిక బాయి పాత్రలో పద్మిని, సదా శివ రావు భార్య పార్వతి పాత్రలో కృతిసనన్, మొగల్ దురాక్రమణ దారుడు అహ్మద్ షా అబ్దాలీ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ టెక్నికల్ గా ఎంతో ఉన్నతంగా అనిపించింది. సంజయ్ దత్ పాత్ర ట్రైలర్ చివరిలో “ఒక గుప్పెడు మట్టి కోసం ఎందుకు నువ్వు ఇంత ఆరాటపడుతున్నావ్! అని ప్రశ్నించగా “నా మాతృభూమి కి సంబంధించినంతవరకు ఒక క్షణం కోసం కూడా నేను చనిపోవడానికి సిద్ధపడతానని”,అర్జున్ కపూర్ పాత్ర చెప్పే డైలాగ్ ఎంత ఎమోషనల్ గా ఉంది. డైరెక్టర్ అసుతోష్ గోవారికర్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అతుల్ ఇచ్చిన సంగీతం అద్భుతంగా ఉంది. ఏదైనా సినిమా వాళ్ళ పరిస్థితి “కాళిదాసు కవిత్వం – కొంత నా పైత్యం కొంత” అన్నట్లు తయారైంది. ఏది ఏమైనా అంటే సినిమాటిక్ లిబర్టీ అంటున్నారు. మరి అశుతోష్ గోవారికర్ ఈ సినిమాని అయినా చరిత్రలో ఉన్నది ఉన్నట్లు తీస్తాడా..? లేక జోధా అక్బర్ సినిమాలో లాగా చరిత్ర వక్రీకరణకు పాల్పడతాడా.? అనేది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32oWiEd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...