Skip to main content

బన్నీ ఫ్యాన్స్ కు శుభవార్త – మూడో పాటకు సర్వం సిద్ధం

Ala Vaikunthapurramloo third single teaser tomorrow
Ala Vaikunthapurramloo third single teaser tomorrow

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో చిత్ర ప్రమోషన్స్ దూకుడు మాములుగా ఉండట్లేదు. ఏ చిత్రానికి కనీవినీ ఎరుగని రీతిలో అల వైకుంఠపురములో కి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. అయితే ఇంకా దానికి చాలా సమయం ఉన్నా కానీ రెండు నెలల ముందు నుండే ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సినిమా ఎప్పుడూ వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముందు సామజవరగమన అంటూ మొదటి సింగిల్ విడుదల చేయగా అది మొదటిసారికే వైరల్ గా మారింది. క్రమక్రమంగా ఈ పాట సూపర్ హిట్ స్టేటస్ దాటి అంతకు మించి అనేలా ఉంది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో 75 మిలియన్ వ్యూస్ ను దాటి దూసుకుపోతోంది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే డిసెంబర్ లోపే 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించడం ఖాయం.

ఇక దీపావళి కానుకగా రెండో పాట రాములో రాములను విడుదల చేసారు. ఈ పాట మొదటి పాటకు తగ్గ రేంజ్ లో ఉండడంతో తొలిరోజు నుండే సూపర్ సాంగ్ అన్న టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన తొలి 24 గంటల్లో అత్యంత ఎక్కువగా విన్న సౌత్ ఇండియన్ పాటగా రాములో రాముల నిలిచింది. ఇలా ఈ రెండు పాటలు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవధుల్లేవు. రెండో సాంగ్ విడుదల తర్వాత సామజవరగమన షూట్ కోసం ఫ్రాన్స్ వెళ్లిన అల వైకుంఠపురములో టీమ్ ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా షూట్ చేయని లొకేషన్స్ లో షూట్ చేసుకుని వచ్చింది.

టీమ్ తిరిగి రావడంతో రిలాక్స్ అవ్వకుండా మూడో పాటకు సంబంధించిన అప్డేట్ ను కూడా ఇచ్చాడు. ఓ మై గాడ్ డాడీ అంటూ సాగే మూడో పాటకు సంబంధించిన టీజర్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంతేకాకుండా ఈ పాటలో ఇద్దరు సర్ప్రైజ్ ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు.

రేపు నవంబర్ 14 బాలల దినోత్సవం కావున అల్లు అర్జున్ ఇద్దరు పిల్లలు ఈ సాంగ్ షూట్ లో కనిపిస్తారేమోనన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మొదటి రెండు పాటలు సూపర్ హిట్ కావడంతో మూడో పాట ఎలా ఉంటుందోనన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. మూడో పాట విడుదలను రేపు టీజర్ తో పాటే తెలుపనున్నారు. మొదటి రెండు పాటలకు ఇలాగే మొదట టీజర్ వదిలి తర్వాత పూర్తి పాటను వదలడంతో దీనికి కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు.

పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోన్న అల వైకుంఠపురములో లో సుశాంత్, నివేద పేతురాజ్, నవదీప్, టబు, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ కూడా ఈ నెలలోనే వస్తుందన్న పుకార్లు ఉన్నాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32K3meI

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...