Skip to main content

మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్

trivikram srinivas birthday special
trivikram srinivas birthday special

ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అలియాస్ ఏఎన్ఎస్ ఈ పేరు గురించి మనకు పెద్దగా తెలియదు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి చూడండి.. అక్షరం కొత్త గౌరవాన్ని సంతరించుకుంటుంది. అక్షరం ఇంత అందంగా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. మాటలతో మాయ చేయగల ఆయన నైపుణ్యాన్ని చూసి ముచ్చటేస్తుంది. ఆయన ఏం చెప్పినా వినాలనిపిస్తుంది, అందులోనుండి ఏదోకటి నేర్చుకోవచ్చనిపిస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూపించే త్రివిక్రముడు పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ప్రత్యేక కథనం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేస్తాడు, సంచుల కొద్దీ పంచులు వేస్తాడు. కానీ ఆయన ఉద్దేశం పంచ్ వేయడం కాదు, మనకు ఏదొకటి తెలియజెప్పడం. మనుషులకు చాలా సరళంగా అర్ధమయ్యే భాషలో చెబితే వింటారు అని నమ్మి ఆ దిశగా ప్రయత్నిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు. కానీ ఆయన ప్రయాణం అంత సజావుగా సాగలేదు. డబ్బులు లేక తిండి తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. కాళ్ళు జాపుకుని పడుకునే అంత రూమ్ కూడా దొరక్క కాళ్ళు ముడుచుకుని పడుకున్న రోజులున్నాయి. కష్టాలు అనుభవించాడు.. కానీ ఏనాడు కన్నీళ్లను రానివ్వలేదు. జీవితంలో సుఖాలూ చూసాడు.. దాన్ని కూడా నెత్తికెక్కించుకోలేదు.

నవంబర్ 7న భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ బాల్యం నుండి చాలా తెలివిగల వాడు. చిన్నతనం నుండి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తను సినిమాల్లోకి వెళ్తానంటే చదువు అబ్బలేక అటు వెళుతున్నాడు అని అనుకోకూడదని, న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత టీచర్ గా చేరినా ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ ఆలోచన ఎప్పుడూ సినిమాల మీదే ఉండేది. అందుకే హైదరాబాద్ కు వచ్చి సినిమాలలో పనిచేయడానికి వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా కలిసిన వ్యక్తే సునీల్. ముందు రూమ్మేట్ అయ్యి, తర్వాత తన ద్వారానే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరితే.. దర్శకుడు అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని తెలుసుకున్న ఏఎన్ఎస్ అసిస్టెంట్ రైటర్ గా పోసాని దగ్గర స్థానం సంపాదించగలిగాడు. పోసాని దగ్గర తక్కువ కాలంలో నమ్మకం సంపాదించుకున్న ఏఎన్ఎస్ సొంతంగా సీన్లు, డైలాగులు రాసే స్థానానికి ఎదిగాడు. గోకులంలో సీత సినిమాకి క్లైమాక్స్ సీన్, మాటలు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం గమనార్హం. అయితే అసిస్టెంట్ రైటర్ గా చేస్తున్నప్పుడు వచ్చే డబ్బులు ఏ మూలకి సరిపోక ఆకలితో పని చేస్తున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు విజయ్ భాస్కర్ తో జరిగిన పరిచయం తన కెరీర్ నే మార్చేసింది. స్వయంవరం తో రైటర్ గా మారిన ఏఎన్ఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మారాడు. ఇక అక్కడినుండి వెనుతిరిగి చూసింది లేదు. సిందూరం, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, వాసు, మల్లీశ్వరి వంటి సినిమాలకు పనిచేసాడు. వీటిలో దాదాపు అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో పాటు త్రివిక్రమ్ కు మంచి పేరొచ్చింది.

నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్ర దర్శకుడైనా, ప్రేక్షకులు మాత్రం మొదట త్రివిక్రమ్ అనగానే గుర్తు తెచ్చుకునేది ఆతని మాటలనే. ఏదైనా విషయాన్ని స్పష్టంగా ఎదుటివారికి అర్ధమయ్యే రీతిలో ఆసక్తికరంగా చెప్పగల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాల్లో మాటలే కాకుండా, బయట ఫంక్షన్స్ లో త్రివిక్రమ్ ఇచ్చే స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని పొగుడుతూ ఇచ్చిన స్పీచ్ కానీ, నాన్నల గొప్పతనాన్ని చెబుతూ సన్నాఫ్ సత్యమూర్తి అప్పుడు మాట్లాడిన మాటలు కానీ, అ.. ఆ సినిమా విడుదల సమయంలో మనిషి చాలా చిన్న చిన్న పనులకే గొప్ప వ్యక్తి ఎలా కాగలడో చెప్పే స్పీచ్ కానీ ఇప్పటికీ అవి ఎవర్ గ్రీన్ గా మిగిలిపోతుంటాయి. లైఫ్ లో ఎప్పుడైనా కొంచెం లో గా అనిపించినా చాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లలో ఏదోకటి చూసినా జీవితం మీద ఆసక్తి కలుగుతుంది. ఏదొకటి చేయాలన్న తపన పెరుగుతుంది.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ చిత్రంతో కూడా విజయం సాధించి కెరీర్ లో మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుందాం.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/36NXJ2G

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...