Skip to main content

తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!

తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!
తమిళ హీరోలను చూసి మనవాళ్ళు నేర్చుకుంటారా!

ఏ విషయం జరిగినా అందులో మంచి, చెడు రెండూ ఉంటాయంటారు. అలాగే తెలుగు సినిమాకు బాహుబలి రావడం వల్ల మంచే ఎక్కువ జరిగినా కొంత చెడు కూడా ఉంది. బాహుబలి లాంటి సినిమా తెలుగులో తెరకెక్కడం వల్ల తెలుగు సినిమాకు గౌరవం పెరిగింది. తెలుగు సినిమాను అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. ప్రభాస్, రానా, అనుష్క వంటి వారికి హిందీలో అమితమైన గుర్తింపు లభించింది. మరి చెడు ఏం జరిగింది? తెలుగు సినిమా ఖ్యాతి పెరగడంతో అది చూసిన మిగతా ఫిల్మ్ మేకర్స్ తాము కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయాలని కలలు కనడం మొదలుపెట్టారు. ఇందులో తప్పేం లేదు కానీ ఎలాంటి సినిమాను ప్యాన్ ఇండియా చేయాలో ఆలోచించాలి. తాము ఎంచుకున్న కథ ప్యాన్ ఇండియా రీచ్ ఉంటుందో లేదో సరిగ్గా అంచనా వేయగలగాలి. అప్పుడే సినిమాను నిర్మించాలి. అది లేకుండా ప్రతీ కథను ప్యాన్ ఇండియా రీచ్ తో తెరకెక్కించాలి అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా రీచ్ అంటూ తీసిన సాహో, సైరా నరసింహారెడ్డి సినిమాలు దారుణంగా పరాజయం పొందాయి. సాహో నార్త్ లో హిట్టయినా ఇక్కడ పోయింది. నార్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఇక్కడ సౌత్ ఇండియా అభిరుచికి దూరంగా సినిమాను నిర్మించడమే దీనికి కారణమని అంటున్నారు.

మరోవైపు సైరా నరసింహారెడ్డి తెలుగులో తప్ప మిగతా భాషల్లో దారుణంగా విఫలమైంది. ఒక తెలుగువాడి వీర గాథను ఇండియా లెవెల్లో చెప్పాలని ప్రయత్నించడంతో ఆ ఎమోషన్ కు మిగతా భాషల వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. అందుకే సైరా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయినా కానీ ఇంకా ప్యాన్ ఇండియా పిచ్చి తెలుగువాళ్ళకు తగ్గలేదు. మరిన్ని సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో తమిళ హీరోలు చాలా మెరుగ్గా ఆలోచిస్తున్నారు అనిపిస్తోంది. అక్కడ కూడా బాహుబలిని తలదన్నే సినిమా చేయాలని కొంతమందికి అనిపించినా చాలా మంది ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు.

ధనుష్ నే తీసుకుంటే తన సినిమాలు తెలుగులో విడుదలవుతాయి, హిందీలో కూడా రెండు సినిమాలు చేసాడు. అలా అని చెప్పి తన లేటెస్ట్ సినిమా అసురన్ ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయలేదు. ఎందుకంటే ఈ చిత్రం తమిళ నేటివిటీకి అద్దం పడుతూ తెరకెక్కింది. అక్కడి జనాలకు మాత్రమే అర్ధమయ్యే ఎమోషన్ చిత్రంలో మిళితమై ఉంటుంది. దాన్ని ఇండియా వైడ్ గా తీస్తే కచ్చితంగా ప్లాప్ అవుతుంది. అందుకే ధనుష్ ఆ సాహసం చేయలేదు. ముందు సౌత్ ఇండియాలో తన బేస్ స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు.

అలాగే విజయ్ కూడా, తలుచుకుంటే తన సినిమాను ప్యాన్ ఇండియా రిలీజ్ చేయవచ్చు. కానీ బిగిల్ ను తమిళ్ తో పాటు కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేసాడు. భారీ కాన్వాస్ ఉన్న సినిమాను హిందీలో ఆర్భాటాల మధ్య విడుదల చేయవచ్చు కానీ ఇది కూడా అంతే. సౌత్ వాళ్లకు మాత్రమే నప్పుతుంది. అందుకనే కథ ఓకే అయినప్పుడే అది ఎంతవరకూ తీయాలనేది క్లారిటీ ఉండడం మంచిది.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32F3PPl

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...