Skip to main content

తిప్పరా మీసం మూవీ రివ్యూ

తిప్పరా మీసం మూవీ రివ్యూ
తిప్పరా మీసం మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి తదితరులు
దర్శకత్వం: విజయ్ కృష్ణ
నిర్మాత‌లు: రిజ్వాన్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్: సిధ్
ఎడిటర్: ధర్మేంద్ర కాకర్ల

రీసెంట్ గా బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు ఈసారి పూర్తిగా బి,సి సెంటర్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రం తిప్పరా మీసం. ప్రోమోలు, ట్రైలర్ లతో అలరించిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. టాలెంటెడ్ నటుడైన శ్రీవిష్ణు తొలిసారి పూర్తి మాస్ క్యారెక్టర్ చేయడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మరి తిప్పరా మీసం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్నతనంలోనే దారితప్పుతాడు. ఆ వయసులోనే డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి ఈ క్రమంలో తన తల్లి (రోహిణి)పై ద్వేషం పెంచుకుని ఆమెకు దూరంగా ఉంటాడు. పెద్దయ్యాక పబ్ లో డీజేగా పనిచేస్తూ అక్కడ కూడా బెట్టింగ్స్ అవీ వేస్తూ ఆర్ధిక ఇబ్బందులు కొనితెచ్చుకుంటాడు. ఇవిలా ఉండగానే మౌనిక (నిక్కీ తంబోలి)ను ప్రేమిస్తాడు. ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఇల్లీగల్ గేమ్స్ పై ఆసక్తి చూపిస్తాడు. కానీ వీటివల్ల తన జీవితమే తలక్రిందులవుతుంది. ఇల్లీగల్ గేమ్స్ వల్ల మణిశంకర్ ఎదుర్కునే ఇబ్బందులేవిటి? తన తల్లి ప్రేమను మణిశంకర్ అర్ధం చేసుకోగలిగాడా లేదా? తల్లిని అంతలా ద్వేషించడానికి కారణమేంటి? ఈ విషయాలను తెలుసుకోవడానికి తిప్పరా మీసం చూడాల్సిందే.

నటీనటులు:
శ్రీవిష్ణు ఎంత మంచి నటుడన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా సినిమాల్లో తన నటనాపటిమను చూపించాడు. ఈ చిత్రంలో కూడా భిన్నమైన ఎమోషన్స్ ను పండించే అవకాశం దక్కింది. వాటిని చాలా చక్కగా తెరపై పండించగలిగాడు శ్రీవిష్ణు. సినిమా చివర్లో తన తల్లికి క్షమాపణ చెప్పుకునే సన్నివేశం చాలు శ్రీవిష్ణు రేంజ్ ను చెప్పడానికి. లవ్ సీన్స్ లో కూడా శ్రీవిష్ణు బాగా నటించాడు. నిక్కీ తంబోలి చూడటానికి బాగుంది. సినిమాలో ఆమె ఉన్నంతసేపూ ఆకట్టుకుంది. అయితే నటనాపరంగా పెద్దగా స్కోప్ ఏం దక్కలేదు. తల్లి పాత్రలో రోహిణికి చాలా మంచి పాత్ర పడింది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించేసిన రోహిణి ఈ చిత్రంలో ఎమోషనల్ సన్నివేశాల్లో జీవించేసింది. ఎమోషనల్ ప్రేక్షకుడిని సినిమాతో కనెక్ట్ చేయడంలో ఆమె విజయవంతమైంది. బెనర్జీకి కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర పడింది. మిగతా వారు ఈ సినిమాకు తమ వంతు పాత్ర పోషించారు.

సాంకేతిక విభాగం:
కథకుడిగా విజయ్ కృష్ణ విజయవంతమయ్యాడు. తిప్పరా మీసం కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే కథే ఇది. అయితే దర్శకుడిగా మాత్రం అతను విఫలమయ్యాడని చెప్పాలి. ఈ సినిమా కథకు తగ్గట్లుగా సన్నివేశాల్ని అల్లడంలో, ఆసక్తికరంగా సినిమాను చెప్పడంలో అతను తడబడ్డాడు. సినిమా పేస్ కూడా చాలా స్లో గా ఉంటూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఇక సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అదరగొట్టాడు. కానీ పాటల విషయంలో ఎక్కువ న్యాయం చేయలేదు. లవ్ సాంగ్ ఒకటే కొంచెం పర్వాలేదు. మిగతావి అంత గుర్తుండవు. సినిమాటోగ్రఫీ రియలిస్టిక్ గా ఉంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరిగా:
కథ బాగుంటే సరిపోదు, దాన్ని ఎఫెక్టివ్ గా ప్రేక్షకుడికి చెప్పగలగాలి. వినగానే బాగుందనిపించే తిప్పరా మీసం కథని ఆసక్తి లేని సన్నివేశాలతో ముందుకు నడిపించాలని చూసాడు దర్శకుడు. తెరపై శ్రీవిష్ణు, రోహిణి వంటి వారు ఎంత అద్భుతంగా నటించేసినా సన్నివేశాల్లో బలం లేకపోతే ప్రేక్షకుడికి అది పరీక్షే. మదర్ సెంటిమెంట్, అండర్ వాటర్ ఎపిసోడ్, ఫారెస్ట్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్స్ కాగా స్లో పేస్, ఆసక్తి లేని సన్నివేశాలు సినిమాకి మైనస్. ఇక ఈ సినిమాను చూడాలో వద్దో మీరే డిసైడ్ చేసుకోండి.

రేటింగ్ : 2.5/5



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/32uj3XB

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...