Skip to main content

తెలంగాణా R.T.C సమ్మె – అసలు నిజాలు

telangana tsrtc strike
telangana tsrtc strike

తెలంగాణా లో RTC సమ్మె మొదలై నెల రోజులు దాటిపోయింది. RTC ని ప్రభుత్వ విలీనంతో పాటు, జీతాలు, ఇంక్రిమెంట్ల పెంపు వంటి 26 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. కానీ అలా చేస్తే తర్వాత సుమారు 56 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా విలీనానికి పట్టుబడితే ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ మొయ్యలేని భారం పడుతుంది అని క్యాబినెట్ మరియు ఇతర నిపుణులు సూచిస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కేంద్రం సవరణ చేసిన మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం- 2019 సెక్షన్ 67ప్రకారం ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వనున్నామని తెలిపింది. పలు రూట్లను ప్రైవేట్ పరం చేయనున్నామని తెలిపింది. నష్టాలలో ఉన్న రూట్లను ప్రైవేటు వాళ్ళకి లీజుకు ఇస్తామని లాభాలు వచ్చే రూట్ల లో మాత్రమే ఆర్టీసీ నడుపుతామని కూడా ప్రభుత్వం ప్రకటించింది.

నష్టాలు వచ్చే రూట్ల లో ప్రైవేటు వాళ్ళు ఎందుకు బస్సు తిప్పుతారు.?

ప్రభుత్వాలు రాయితీ ఇస్తే తప్ప వాళ్ళు అలా చేయరు. అదేదో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమకే ఇవ్వచ్చు కదా అని కార్మికులు అడుగుతున్నారు.

అసలు లెక్క ప్రకారం సమ్మె జరిగినప్పుడు సంబంధిత రవాణా శాఖ మంత్రి కలుగజేసుకొని చర్చలు జరిపి అప్పటికీ పరిష్కారం కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి సమస్యను చక్కదిద్దవలసి ఉంది.

తెలంగాణలో ఆర్టీసీకి ఇప్పటివరకు దాదాపు మూడేళ్లుగా పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ పదవి నియామకం జరగలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు ప్రభుత్వం తరపు నుంచి ఆర్టీసీ జరుగుతున్న చెల్లింపులు గురించే మాట్లాడుతున్నారు తప్ప, ఆర్టీసీ ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టే  పన్నుల గురించి ప్రస్తావించకపోవడం బాధాకరం.

ఇక సీఎం కేసీఆర్ ఆర్టీసీకి 1200 కోట్ల రూపాయల నష్టాలను ఉందని ప్రకటించారు కానీ ఆర్టీసీ యాజమాన్యం సంబంధిత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సమర్పించిన రిపోర్టులో ఉన్న మొత్తం 928 కోట్లు అంటే 25 శాతం ఎక్కువ చేసి కేసీఆర్ ఎందుకు చెప్తున్నారు.?

ఆర్టీసీ కిలోమీటర్ కు దాదాపు 13 రూపాయల నష్టం వస్తుందని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు.  కానీ 2018  – 2019  ఆర్టీసీ అధికారిక లెక్కల ప్రకారం ఆర్టీసీ కిలోమీటర్కి ఏడు రూపాయల నష్టం వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.ఇందులో కూడా ఇంత వ్యత్యాసం ఎందుకు.?

ఆర్టీసీకి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను 4580 కోట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు.  కానీ ఇందులో గుర్తు చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే రియంబర్స్మెంట్ కింద ఆర్టీసీకి దాదాపు ప్రభుత్వమే 2800 కోట్లు చెల్లించాలి.

ఇక అద్దె బస్సులు లాభం తెచ్చిపెడతాయి అన్న ప్రశ్నకి సమాధానం… అద్దె బస్సుల కు సంబంధించిన ఇన్సూరెన్స్, డ్రైవర్లకు ఇచ్చే పిఎఫ్,  ఆ బస్సులకు కట్టే పన్నులు అన్ని ఆర్టీసీ భరిస్తుంది.

నష్టాలు వచ్చినా లాభాలు వచ్చిన సంస్థ పరంగా బస్సుల సంఖ్య పెంచుకుంటూ మన ఆర్టీసీ ప్రతిపాదనను గవర్నమెంట్  పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా నష్టాలు వచ్చే  రూట్లలో అయినా పనులు రద్దు చేయండి అన్న ఆర్టీసీ ప్రతిపాదనను పరిశీలిస్తే బాగుంటుంది.

ఇంకా ఆర్టీసీ టైర్ల మీద రోడ్డు టాక్స్ రూపంలోనూ మరియు ముడి భాగాల పైన పైన మొత్తంగా సంపాదించే ప్రతి రూపాయిలో 21 పైసలు టాక్సులు కడుతుంది. మొత్తానికి ఆర్టీసీ విషయమైనా, ప్రజారవాణా  విషయమైనా  సంబంధిత యూనియన్లు అత్యాశతో,  పరిస్థితిని చక్కదిద్ది శాంతి పూర్వకమైన వాతావరణాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం అహంకారం తో  వ్యవహరించడం  ఏమాత్రం మంచి పద్ధతి కాదు



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/33mSPYh

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...