Skip to main content

30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ…

30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ...
30 సంవత్సరాల క్రింద సైకిల్ చైన్ కథ…

కొంతమంది దర్శకులు మన తెలుగు చిత్ర పరిశ్రమలో అణిగిమణిగి ఉంటారు.కొందరు కథ ని నమ్మి ఎవ్వరి మాట వినకుండా వారి పని వారు చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకొందరు నిర్మాతలే దేవుళ్ళు కాబట్టి వాళ్ళ మాట మాత్రమే వింటారు, కానీ ‘రామ్ గోపాల్ వర్మ‘ మాత్రం ఒకసారి కథని నమ్మితే తన మాట కూడా వినరు. అలాంటి డేరింగ్ మరియు డాషింగ్ వర్మ గారు తీసిన 30 సంవత్సరాల క్రితం సినిమా ఇది.

అక్కినేని నాగర్జున తో కలిసి చేసిన ”శివ” సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. సినిమాలో ఒక సన్నివేశం దగ్గర నాగార్జున రౌడీ లతో గొడవ పడేటప్పుడు సైకిల్ చైన్ ని తెంపేస్తాడు. మొత్తం సినిమాలో మనకి ఆ ఒక్క సన్నివేశం మాత్రమే గుర్తుంది అంటే అది ‘రామ్ గోపాల్ వర్మ’ అని చెప్పవచ్చు. 1989 అక్టోబర్ 05 న విడుదల అయిన ఈ సినిమా నేటితో 30 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.

ఈ విషయాన్ని వర్మ గారు ట్విట్టర్ ద్వారా నాగార్జునని టాగ్ చేసి మరీ చెపుతున్నారు. “హే నాగార్జున చూడు మన సినిమా (బిడ్డ) పుట్టి 30 సంవత్సరాలు అయ్యింది” అని అన్నాడు. తను ట్విట్టర్ లో కూడా పలు సంచలనాలు పుట్టిస్తాడు అని మనకి తెలిసిందే కదా. వర్మ గారి సినిమాలు కూడా దాదాపు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ పరిశ్రమలలో కలిపి 60 సినిమాలకి దర్శకత్వం చేసిన వర్మ గారి కెరీర్ లో ”శివ” సినిమా పరుపురాని తీపి గుర్తు.

ఇక నాగార్జున గారి కెరీర్ కూడా అప్పుడు అంతగా లేదు…ఒక్కసారి శివ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్నాడు. అక్కినేని అమల గారి ‘ఆశ’ (శ్రీమతి) క్యారక్టర్ కూడా సినిమాకి మంచి బలం అయ్యింది. ఇక ‘రఘువరన్’ గారి విలన్ క్యారక్టర్ ని ఎలా మర్చిపోగలము చెప్పండి. భవాని అని పేరు ఇప్పటికి గుర్తుంది అంటే అంతలా జీవించేసారు అని చెప్పవచ్చు. ఇళయరాజా గారి సంగీతం కూడా మనసుని పులకరింప చేస్తుంది.

అక్కినేని అభిమానులకి మాత్రం శివ సినిమా ఒక మంచి అనుభవం అని చెప్పవచ్చు. ట్విట్టర్ లో కూడా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Credit: Twitter



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LLOG9W

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...