Skip to main content

వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?

వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?
వర్మ యూ టర్న్ కు కారణమేంటి? నిజంగానే భయపడ్డాడా?

రామ్ గోపాల్ వర్మ.. బయటకి గొప్ప ధైర్యవంతుడిలా.. ఏది పడితే అది చేసేసే వ్యక్తిలా.. తనను మించిన వాడు లేడనేలా ప్రవర్తిస్తాడు కానీ నిజానికి వర్మ కూడా భయస్తుడే. అతను భయపడకుండా కొన్ని సినిమాలు తీసుండొచ్చు కానీ భయపడి మానేసిన సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. సరదాకి వర్మ మీద ఒక్క గొప్ప సెటైర్ ఇండస్ట్రీలో ఉంది. వోడ్కా మత్తులో సినిమాలు ప్రకటించే వర్మ ఆ మత్తు దిగి పొద్దున్న కాఫీ పడగానే మాట మార్చేస్తాడు అని. దీనిని వర్మ ఒప్పుకుంటాడు కూడా. చాలాసార్లు బహిరంగంగానే వోడ్కా మత్తులో చేసిన ట్వీట్ అదని చెప్పాడు. ఈ ప్రకారం వర్మ ప్రకటించి ఆపేసిన సినిమాల సంఖ్యా డజను దాటి చాలా ఏళ్లయింది. తాజాగా ఈ లిస్ట్ లో చేరిన సినిమాగా మెగా ఫ్యామిలీ చేరుతుంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో వర్మ చాలా వివాదాస్పద అంశాలను జోడించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ కు పప్పు వడ్డించే సన్నివేశం విడుదల చేసిన ట్రైలర్ లో హైలైట్ అంశంగా నిలిచింది. దీన్ని కూడా కామెడీ చేస్తూ వర్మ చాలా సెటైరికల్ గా ఈ సీన్ తీసాడని అందరూ అనుకుంటున్నారు. ఐతే నిన్న ఒక టివి స్టూడియోకిచ్చిన ఇంటర్వ్యూలో ఒక వ్యక్తితో ఫోన్ కాల్ మాట్లాడుతున్న సందర్భంగా అసలు పప్పు సీన్ కు అందరూ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలీదు అంటూ అమాయకంగా నటించే ప్రయత్నం చేసాడు. సదరు వ్యక్తి నాకా సన్నివేశం చాలా నచ్చింది, అసలు పప్పు వేయడం సూపర్ అంటుంటే వర్మ, ఎందుకని పప్పు వేస్తె ఏమైంది.. నేనేదో క్యాజువల్ గా వేయించా అంటూ అదేం తెలీనట్లు హడావిడి చేసాడు.

ఈ సినిమా సంగతి పక్కనపెడితే వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తర్వాత తాను చేయబోయే చిత్రం మెగా ఫ్యామిలీ అంటూ పెద్ద బాంబే పేల్చాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ గుస్సా అయ్యారు కూడా. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ ను అంటూ ఏదొక రకంగా కామెంట్ చేస్తూ వచ్చిన వర్మ, ఈసారి మొత్తం మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడంటూ మెగా ఫ్యాన్స్ కొంత కంగారు పడ్డారు. తమ హీరోల గురించి ఏం చూపిస్తాడోనంటూ వారు ఊహాగానాలు కూడా మొదలుపెట్టారు. అయితే అంతలోనే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తాను చేయట్లేదని చెప్పి మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేసాడు. మెగా ఫ్యామిలీ అనే సినిమా 39 మంది పిల్లల్ని కన్న ఒక వ్యక్తి కథ. అందుకే ఈ చిత్రానికి ఆ టైటిల్ పెట్టాను. కానీ నేను చిన్న పిల్లల సినిమాలు తీయను కాబట్టి ఈ సినిమాను పక్కనపెట్టేసాను అంటున్నాడు. మరి అలాంటప్పుడు అసలు ప్రకటించడం దేనికంటూ సదరు యాంకర్ అడుగగా డబల్ వోడ్కా పెగ్ లో ట్వీట్ చేశాను. పొద్దున్న కాఫీ తాగగానే సినిమా చేయకూడదనుకున్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేసాడు. కానీ వర్మ భయపడ్డాడని, మెగా ఫ్యామిలీ నుండి ఎవరైనా ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చని, దానికి భయపడే వర్మ ఈ సినిమా తీసే ప్రయత్నం మానుకున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో రామ్ గోపాల్ వర్మకే తెలియాలి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pub35W

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...