Skip to main content

బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్

బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్
బిగ్ బాస్ 3 లో మారిన షెడ్యూల్.. బాబా భాస్కర్ కు స్వీట్ షాక్

బిగ్ బాస్ లో నిన్న బాబా భాస్కర్ కు స్వీట్ షాక్ తగిలింది. సాధారణ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టిన బాబా భాస్కర్, మహా అయితే రెండు లేదా మూడు వారాలు ఉంటాడు అనుకున్నారు. బాబా భాస్కర్ కూడా అదే చెప్పుకొచ్చాడు. తాను రెండు వారాలకు మించి ఉండనేమోనని, అందుకే బట్టలు కూడా రెండు వారాలకు సరిపడా తెచుకున్నానని బాబా భాస్కర్ తెలిపాడు. అయితే తనదైన కామెడీ టైమింగ్ తో అందరి మీద పంచ్ లు వేస్తూ బిగ్ బాస్ లో ఎంటర్టైనర్ గా నిలిచాడు. మొదట్లో అంతగా ఓపెనప్ అవ్వకపోవడం బాబా భాస్కర్ కున్న నెగటివ్ కాగా నెమ్మదిగా ఆ విషయంలోనూ కరెక్ట్ చేసుకున్నాడు.

ఇంట్లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతూ అసలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే మర్చిపోయిన తరుణంలో బాబా భాస్కర్ ఒక్కడే కొంచెం కామెడీ చేసి స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా అని చెప్పి కామెడీ ఒకటే చేస్తాడనుకుంటే పొరబాటే. ఇంట్లో ప్రతిరోజూ అందరికీ వండి పెడుతూ ఒక్కరోజు కూడా విసుగు లేకుండా చేసుకొచ్చాడు. ఇక టాస్క్ లు ఇస్తే 100 శాతం ఇవ్వడమే అతనికి తెలుసు. అందుకే బాబా భాస్కర్ అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 3 లో ఫినాలే వీక్ లోకి అడుగుపెట్టిన సెకండ్ కంటెస్టెంట్ గా బాబా భాస్కర్ నిలిచాడు. ఇప్పటికే రాహుల్ టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫైనల్స్ కు చేరుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు బాబా భాస్కర్ కూడా ఫైనల్స్ కు చేరడంతో మిగిలిన నలుగురు హౌజ్ మేట్స్ లో నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం శ్రీముఖి, వరుణ్ సందేశ్, శివ జ్యోతి, అలీ నామినేషన్స్ లో ఉన్నారు. ఈరోజు శనివారం నాగార్జున రానున్నాడు కాబట్టి కనీసం ఒకరినైనా సేవ్ చేస్తారేమోనన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి చూస్తుంటే అలీ లేదా శివజ్యోతికి మూడినట్లే అనిపిస్తోంది. మరి అందరి అంచనాల ప్రకారం వీరిద్దరిలో నుండే ఒకరు ఎలిమినేట్ అవుతారా లేక అందరికీ షాక్ ఇస్తూ వరుణ్, శ్రీముఖిలలో ఒకరు వెళ్ళిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఈరోజు నాగార్జున వచ్చి ఏం మాట్లాడనున్నాడా అని అందరికీ ఆసక్తిగా ఉంది.

ఇది పక్కన పెట్టి అసలు నిన్న ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి గమనిస్తే… నిన్న రాత్రి వరకూ కంటెస్టెంట్స్ కు ఎటువంటి టాస్క్ లు ఇవ్వకపోవడంతో అందరూ రిలాక్సింగ్ మూడ్ లోకి వెళ్లారు. కానీ రాత్రి ప్రముఖ షాపింగ్ మాల్ కెఎల్ఎం వారి నుండి వచ్చిన స్పెషల్ బట్టలు వేసుకుని హౌజ్ మేట్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ర్యాంప్ మీద వాక్ చేసారు. దాని తర్వాత లేడీ కంటెస్టెంట్స్, జెంట్స్ లో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే జెంట్స్ అందరూ కలిసి అమ్మాయిలలో ఒకరిని బెస్ట్ గా ఎంపిక చేయాలి. ఇలా సెలెక్ట్ అయిన ఇద్దరికీ చెరొక 10,000 రూపాయల షాపింగ్ వౌచర్ లభిస్తుంది, అలాగే కెఎల్ఎం ఫ్యాక్షనిష్టా ట్యాగ్ కూడా ఇస్తారు. ఇందులో బాబా భాస్కర్, శ్రీముఖి గెలుపొందారు.

ఇక అందరూ పడుకున్న సమయంలో రాత్రి 3.30 నిమిషాలకు బిగ్ బాస్ సైరన్ మోగించి అందరినీ నిద్ర లేపాడు. దాని తర్వాత నామినేట్ అయిన సభ్యులందరూ తమ బట్టలు ప్యాక్ చేసుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ చెప్పాడు. అందరూ వచ్చిన తర్వాత పోడియంస్ మీద నిలబడమని చెప్పి ఒక్కొక్కరినీ బిగ్ బాస్ లో తమ జర్నీ గురించి వివరించమని అడిగారు. అది కూడా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నామినేషన్స్ నుండి సేవ్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Pl0AtF

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...