Skip to main content

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్
వీడియోలతో కంటెస్టెంట్స్ ను ఏడిపించేసిన బిగ్ బాస్

బిగ్ బాస్ అంటే రకరకాల ఎమోషన్స్ ను చూపిస్తుంది. హౌజ్ లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ ఎలాంటివాడైనా సరే ఎమోషన్స్ అన్నిటీనీ దాటుకుని ముందుకెళ్లాల్సిందే. కోపం, బాధ, ప్రేమ, ఆనందం.. ఇలా భావాలు ఏవైనా వాటిని వ్యక్తపరచకుండా ఉండలేరు. అదే బిగ్ బాస్ ఉండనివ్వడు. ఇద్దరు స్నేహంగా ఉంటే వారి మధ్య గొడవలు పెట్టి వాళ్ళ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అన్నది చూస్తాడు. ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటే వారిని ఒక టీమ్ గా పెట్టి టాస్క్స్ ఆడిస్తాడు. మొత్తానికి ఒకే రకమైన ఎమోషన్ తో ఎవరినీ ఉంచడు బిగ్ బాస్. అందరినీ నవ్వించే బాబా భాస్కర్ ను ఏడిపించగలడు. అందరిచేత మిస్టర్ కూల్ అనిపించుకున్న వరుణ్ సందేశ్ కి కోపం తెప్పించగలడు, టాస్క్ లంటే 100 శాతం ఇచ్చే అలీను టాస్క్ నుండి ఎలిమినేట్ చేయగలడు, పెద్దగా ఎమోషన్స్ బయటకు రానివ్వడానికి ఇష్టపడని రాహుల్ చేత ఎమోషనల్ అయ్యేలా చేయగలడు, ఇంకా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖిని డల్ గా మార్చేయగలడు. ఇలా ఒక పర్సన్ ఎలా ఉంటాడో వాడిలోని ఆపోజిట్ కోణాన్ని ఆవిష్కరించగలడు. అందుకే బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయింది.

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. మరొక మూడు రోజులాగితే విన్నర్ ఎవరన్నది తేలిపోతుంది. ప్రస్తుతం ఉన్న ఐదుగురు హౌజ్ మేట్స్ లో ఎవరికి వారే ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక లాస్ట్ వీక్ కావడంతో బిగ్ బాస్ కూడా పెద్దగా ఏం టాస్క్స్ ఇవ్వట్లేదు. హౌజ్ మేట్స్ దీంతో బాగా రిలాక్స్డ్ మూడ్ లో ఉన్నారు. తమ జర్నీని ఆస్వాదిస్తున్నారు. జరిగిన గొడవలను మర్చిపోయి అందరూ కలిసి మెలిసి ఉంటున్నారు.గత రెండు ఎపిసోడ్స్ సుమ వచ్చి ఫుల్ ఫన్ జనరేట్ చేసి వెళ్ళిపోయింది. సుమ వచ్చినప్పుడే ప్రతి కంటెస్టెంట్ కు వచ్చిన ఫ్యాన్ మెయిల్స్ ను చదివించారు. ఇందులో కంటెస్టెంట్ గురించి గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉన్నాయి. ఇక సుమ వెళ్ళిపోయాక బిగ్ బాస్ పెద్ద టాస్క్ ఏం పెట్టకుండా భవిషత్తు గురించి డౌట్స్ ఉంటే అడిగి తీర్చుకోండి అని ఒక స్పెషలిస్ట్ ను హౌజ్ లోకి పంపిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు ఉదయం కంటెస్టెంట్స్ ను లేపాక సాయంత్రం 6 గంటల వరకూ కంటెస్టెంట్స్ కు ఏ పని లేదు. అలా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ టైమ్ పాస్ చేసారు.

అయితే ఆరు తర్వాత హౌజ్ మేట్స్ అందరికీ ఒక సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఒకరి తర్వాత ఒకరిని లోపలికి పంపి వారి జర్నీని చూపించి, వారి గురించి నాలుగు మంచి మాటలు చెప్పి కీలకమైన ఫైనల్ ఎపిసోడ్ కు ముందు వారిని సమాయత్తం చేసాడు. ముందుగా వరుణ్ సందేశ్ ను యాక్టివిటీ ఏరియాకు పిలిపించిన బిగ్ బాస్, ఆ రూమ్ లో అప్పటికే హౌజ్ మేట్స్ ఆడిన టాస్క్ లకు సంబంధించిన గుర్తులను పెట్టి అక్కడ ఒక పోడియం మీద నిలబడమని చెప్పి వరుణ్ గురించి, తను ఎందులో తోపు అన్నది వివరించడం, వారికి సంబంధించిన వీడియోను స్పెషల్ గా కట్ చేయడం వంటివి హౌజ్ మేట్స్ ను ఎమోషనల్ చేసేశాయి. వరుణ్ ను మిస్టర్ పెర్ఫెక్ట్, సూపర్ కూల్ అన్నట్లుగా బిగ్ బాస్ కొనియాడారు. తన వీడియోను చూసుకున్న వరుణ్ సందేశ్ బయటకు వచ్చి హౌజ్ మేట్స్ అందరితో లోపలవీడియో సూపర్ గా ఉంది అని చెప్పాడు. ఒక మంచి ఫీల్, పాజిటివ్ ఎనర్జీ వచ్చాయని అన్నాడు.

వరుణ్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ వంతు. రాహుల్ ను మొదట అందరూ లేజి అని వంక పెట్టి నామినేట్ చేయడం దగ్గరనుండి తను ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు, బిగ్ బాస్ 3 లోకి ఎంటర్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎలా నిలిచాడు అన్నది ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. రాహుల్ కూడా ఈ వీడియో చూసి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. ఇక బాబా భాస్కర్ రావడమే నేను అసలు ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నాడు. కానీ వీడియో చూసిన తర్వాత బాబా భాస్కర్ ఎందుకో విపరీతంగా ఎమోషనల్ అయిపోయాడు. వీడియో గురించి మాట్లాడుకుంటే ఈరోజు ప్లే చేసిన ముగ్గురిలో బాబా భాస్కర్ కు ది బెస్ట్ కట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒక సూపర్ స్టార్ రేంజ్ లో బాబా భాస్కర్ ను ఎలివేట్ చేసిన తీరు సూపర్బ్. రేపటి ఎపిసోడ్ లో శ్రీముఖి, అలీల వీడియోలు ప్లే అవుతాయి.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2WD1pQd

Comments

Popular posts from this blog

అసలు ఈ 1978 పలాస కథ ఏంటిది?

palasa 1978 తెలుగు సినిమా ప్రభావం ‘ రంగస్థలం ‘ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది. వచ్చే సినిమాలు కూడా కథ కంటే కథనం, కొత్తదనం ఉన్న వాటినే ఆదరిస్తున్నారు అని చెప్పి దర్శకులు పాత కాలం నాటి కథలని, వాటికి  కొంచెం వాస్తవాలని జోడించి చేస్తన్నారు కొత్త తరం దర్శకులు. కరుణ కుమార్ దర్శకత్వంలో రానున్న “పలాస 1978” సినిమా కూడా కొత్తదనం కోరుకునే విధంగానే ఉంది. ఈ రోజు సినిమాలోని ట్రైలర్ ని డాషింగ్ ఇస్మార్ట్ డైరెక్టర్ “ పూరి జగన్నాధ్ ” గారు విడుదల చేసారు. సినిమాని జి.ఎస్.కె మీడియా తరుపున ద్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పిస్తున్నారు సినిమాని. సంగీత దర్శకుడిగా కాకుండా సినిమాలో ఇంకొక పాత్రలో ‘రఘు కుంచె’ గారు కూడా నటిస్తున్నారు. ‘లండన్ బాబులు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ‘రక్షిత్ అట్లూరి’ రెండవ సినిమాకే బాగా పరిణితి చెంది చాలా బాగా నటించారు అని అంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు. ఈ సినిమాలో కథానాయికగా నక్షత్ర నటిస్తున్నారు….ఇతర తారాగణం విజయ్ రామ రాజు, తిరు, లక్ష్మణ్ మీసాల, జన, శృతి, ప్రవీణ్, మిర్చి మాధవి, అనుపమ,తన్మయి బోల్ట్, శేయిన్, రాజా రావు  సినిమాలో ...

ప్రభాస్ ని పెళ్ళి చేసుకోమని అనుష్క ని రిక్వెస్ట్ చేస్తున్నారు

అనుష్క ప్లీజ్ ప్రభాస్ ని పెళ్ళి చేసుకోవా ? ప్రభాస్ ప్లీజ్ అనుష్క ని పెళ్ళి చేసుకోవా ? మీ ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉంది . మీ జంట చూడముచ్చటగా ఉంది . ప్రభాస్ ని పెళ్ళి చేసుకో స్వీటూ ( అనుష్క ముద్దుపేరు స్వీటీ ) మీ ఇద్దరి జోడి మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రభాస్ అన్న ని పెళ్ళి చేసుకో అనుష్క …… మీ జోడి ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే సూపర్ ప్లీజ్ …… ప్లీజ్ పెళ్ళి చేసుకోండి అంటూ ఇదే గోల నిన్నంతా సోషల్ మీడియాలో . ప్రభాస్ పుట్టినరోజు నిన్న దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు అనుష్క ని అదేపనిగా రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమిలాడారు నెటిజన్లు . ప్రభాస్ – అనుష్క జంటగా నాలుగు చిత్రాల్లో నటించగా ఆ నాలుగు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి . బిల్లా , మిర్చి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాల్లో ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేసారు ఈ జంట . టాలీవుడ్ లో పలువురు హీరో హీరోయిన్ లు జంటగా నటించి పెళ్ళి చేసుకున్న సంఘటనలు కోకొల్లలు . కృష్ణ – విజయనిర్మల , డాక్టర్ రాజశేఖర్ – జీవిత , నాగార్జున – అమల , శ్రీకాంత్ – ఊహ ,ఇలా పలు జంటలు ఒక్కటయ్యాయి . దాంతో ప్రభాస్ – అనుష్క కూడా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని ముచ్చట పడుతున్నారు . అ...

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్

గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్ , మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్స...